‘సామజవరగమన’ కు 100 మిలియన్ వ్యూస్ రావడంతో ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘అల వైకుంఠపురములో’ మ్యానియాతో పాటు తమన్ కు కూడ విపరీతమైన క్రేజ్ పెరిగి పోయింది. దీనితో చాలామంది దర్శక నిర్మాతలు తమ తదుపరి మూవీ ప్రాజెక్ట్స్ కోసం తమన్ ను సంప్రదిస్తుంటే తమన్ తన పారితోషికాన్ని భారీగా పెంచి ఆ నిర్మాతలకు షాక్ ఇస్తున్నట్లు సమాచారం. 

ఇలాంటి పరిస్థితులలో తమన్ ఏకంగా ‘అల వైకుంఠపురములో’ నిర్మాతలకు వారు ఊహించని డిమాండ్స్ వారి ముందుపెట్టి వారికి షాక్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ‘అల వైకుంఠపురములో’ సినిమాను ప్రమోట్ చేసే వ్యూహాలలో భాగంగా తనపై ఒక స్పెషల్ సాంగ్ వీడియో చెయ్యాలని అందుకోసం ఒక స్పెషల్ సెట్ వెయ్యాలని కోరినట్లు వార్తలు వస్తున్నాయి. 

తమన్ కోరిన విధంగా తమన్ పై స్పెషల్ సాంగ్ వీడియోను ఒక భారీ సెట్ లో చిత్రీకరించాలి అంటే సుమారు 20 లక్షల వరకు ఖర్చు అవుతుందని ఈ మూవీ నిర్మాతలు ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ బడ్జెట్ ఊహించిన స్థాయిని మించి పెరిగి పోవడంతో తల పట్టుకుంటున్న నిర్మాతలు తమన్ కోరిక విని షాక్ అయినట్లు టాక్.  

దీనితో ‘అల వైకుంఠపురములో’ మూవీకి ఏర్పడిన క్రేజ్ ను తనకు కూడ ఉపయోగపడే విధంగా తమన్ వ్యూత్మకంగా ప్రరయత్నిస్తున్నట్లు అనిపిస్తోంది. సాధారణంగా రెహమాన్ లాంటి టాప్ మ్యూజిక్ డైరెక్టర్లకు సంబంధించి ఇలా వారు దర్శకత్వం వహించే సినిమాల విడుదల సమయంలో ఒక ప్రమోషన్ సాంగ్ ను భారీ సెట్ మధ్య షూట్ చేసి ఆ మూవీ పై మరింత క్రేజ్ పెంచడానికి విడుదల చేస్తుంటారు. దీనితో తమన్ తనకు తాను రెహమాన్ స్థాయిలో ఊహించుకుంటున్నాడ అంటూ కొందరు జోక్ చేస్తున్నారు. మరి తమన్ కు తన కోరిక తీరుతుందో లేదో చూడాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: