వరస పరాజయాలతో సతమతమవుతున్న అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నటిస్తున్న తన లేటెస్ట్ మూవీ పై చాల ఆశలు పెట్టుకున్నాడు. ఈ మూవీలో హీరోయిన్ గా పూజ హెగ్డేను ఒప్పించడానికి ఈ మూవీ నిర్మాతలు చాల భారీ పారితోషికం ఆఫర్ చేయవలసి వచ్చింది అంటూ గతంలో కామెంట్స్ వచ్చిన విషయం తెలిసిందే.

అయితే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ కానీ టీజర్ కాని ఇంకా విడుదల కాని పరిస్థితులలో అసలు వీరిద్దరి కాంబినేషన్ వెండితెర పై బాగుంటుందా అంటూ కొందరు సందేహాలు వ్యక్త పరిచారు. ఇలాంటి పరిస్థితులలో ఈ రోజు వీరిద్దరూ కలిసి కాకినాడలో ఒక భారీ షాకింగ్ మాల్ ఓపెనింగ్ కు అతిధులుగా వచ్చారు. 

వీరిద్దరూ హైదరాబాద్ నుండి రాజమండ్రికి స్పెషల్ ఫైట్ లో వచ్చి ఆ తరువాత వీరిద్దరూ కాకినాడకు చేరుకొని ఈ షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో పాల్గున్నారు. అయితే ఆ మాల్ ఓపినింగ్ కు వచ్చిన చాల మంది జనం పూజా హెగ్డేను చూడటానికి ఎగబడుతు ఆమెతో సెల్ఫీలు తీయించుకోవడానికి నానాపాట్లు పడ్డారని తెలుస్తోంది. 

ఈ హడావిడిలో పూజ పక్కన అఖిల్ ఉన్నా జనం మ్యానియా అంతా పూజ వైపే మళ్ళింది. దీనికితోడు వీరిద్దరూ జంటగా మీడియా కెమెరాలకు పోజులు ఇస్తూ నుంచున్న నేపధ్యంలో పూజ ముందు అఖిల్ గ్లామర్ పెద్దగా ఆనలేదు అంటూ కొందరు కామెంట్స్ చేసుకున్నట్లు టాక్. దీనితో అఖిల్ మూవీలో పూజతో రొమాంటిక్ సీన్స్ ను అఖిల్ రక్తికట్టించగలడా అంటూ కొందరు సందేహాలు వ్యక్తపరిచినట్లు టాక్. దీనితో అఖిల్ మూవీలో హీరోయిన్ విషయంలో మళ్ళీ పొరపాటు జరిగిందా అంటూ కొందరు జోక్స్ వేస్తున్నారు. అయితే సినిమా కెమెరాల ముందు కనిపించే గ్లామర్ బయట కనిపించదు కాబట్టి ఇలాంటి కామెంట్స్ వచ్చి ఉంటాయని కొందరు అభిప్రాయ పడుతున్నారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: