విక్టరీ వెంకటేష్ , యువ సామ్రాట్  నాగ చైతన్య నటిస్తున్న లేటెస్ట్ మల్టీ స్టారర్ మూవీ  వెంకీమామ.  నిజ జీవితంలో  మామ, అల్లులు అయిన వీరిద్దరు  ఈసినిమాలో కూడా  ఆ పాత్రల్లోనే కన్పించనుండడంతో  సినిమా ఫై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇటివలే  షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం  ప్రస్తుతం  పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తై  నెలలు కావస్తున్నా విడుదలతేది  విషయం లో  ఎటు తేల్చుకోలేక పోతుంది చిత్ర బృందం.  డిసెంబర్ లో విడుదలచేయ్యాల  లేక  సంక్రాంతి  బరిలో  నిలుపాలో తెలియక  మేకర్స్  గందరగోళానికి గురైయ్యారు. 
 
ఇక ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్  ఓ నిర్ణయానికి వచ్చారట. డిసెంబర్ 25న  ఈ సినిమాను విడుదలచేయాలని అనుకున్నారు. ఈవిషయాన్ని చెప్పటానికి  ఈరోజు ప్రెస్ మీట్ ను కూడా ఏర్పాటుచేశారు. అయితే  మూడు గంటలకు జరగాల్సిన ఈ మీడియా సమావేశం  చివరి నిమిషంలో  రద్దు చేశారు వెంకీమామ టీం. కాగా  ప్రెస్ మీట్ క్యాన్సల్ చేయడానికి గల కారణాలు మాత్రం తెలియాల్సి వుంది.  అయితే  రిలీజ్ డేట్ విషయంలో  మళ్ళీ మనుసు మార్చుకోవడం వల్లే  ప్రెస్ మీట్ ను రద్దు చేశారని వార్తలు వస్తున్నాయి.  ఇక ఈ రోజు ఈ చిత్రం యొక్క విడుదల తేది గురించి  క్లారిటీ వస్తుందనుకున్న అభిమానులకు మళ్ళీ నిరాశేఎదురైయ్యింది. 
 
జై లవకుశ  ఫేమ్  బాబీ డైరెక్షన్ లో కామెడీ ఎంటర్ టైనర్ గా  తెరకెక్కుతున్న ఈ చిత్రంలో  వెంకీ సరసన  హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ నటిస్తుండగా  నాగ చైతన్య కు  జోడిగా  రాశీ ఖన్నా నటిస్తుంది.  సురేష్  ప్రొడక్షన్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ల పై  సురేష్ బాబు , టిజి విశ్వప్రసాద్  సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: