గత ఏడాది ప్రారంభంలో  భాగమతి సినిమా తో ప్రేక్షకులముందుకు వచ్చి సూపర్ హిట్ కొట్టిన  సౌత్  స్టార్ హీరోయిన్ అనుష్క ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా  ప్రేక్షకులను పలకరించలేకపోయింది.   ఈ చిత్రం  తరువాత బరువు  తగ్గడానికి  చాలా గ్యాప్ తీసుకున్న అనుష్క ప్రస్తుతం  'నిశ్శబ్దం' అనే  చిత్రంలో నటిస్తుంది.  ఇటీవల విడుదలైన ఈ చిత్రం యొక్క టీజర్  సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకొని సినిమా అంచనాలను  పెంచేసింది.  ఇక తాజాగా  చిత్ర  బృందం  హైదరాబాద్ లో  మీడియా సమావేశం ఏర్పాటు చేసి  సినిమా విడుదలతేది ని వెల్లడించింది. వచ్చే ఏడాది జనవరి 31న ఈచిత్రం తెలుగు తోపాటు  తమిళహిందీ తో  ఇంగ్లీష్ భాషల్లో  విడుదలకానుంది. 
 
 
 హేమంత్ మధుకర్ తెరకెక్కిస్తున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో  తమిళ నటుడు మాధవన్ మరో లీడ్ రోల్ లో నటిస్తుండగా   ప్రముఖ నటుడు సుబ్బరాజు,  అంజలి , అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే తో పాటు ప్రముఖ  హాలీవుడ్ నటుడు  మైఖేల్ మాడిసన్  ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.  ఈ సినిమా షూటింగ్  అంత  యూఎస్ లోని సియాటెల్ లోనే జరిగింది.   గోపి సుందర్  సంగీతం అందిస్తుండగా   కోన ఫిలిం కార్పొరేషన్ ,పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈచిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.  ఇక గత ఏడాది  అనుష్క నటించిన భాగమతి కూడా జనవరి లోనే వచ్చి  సూపర్ హిట్ అయ్యింది. మరి నిశ్శబ్దం కూడా అదే సెంటిమెంట్ ను  కొనసాగిస్తుందో లేదో చూడాలి. 
 
 
ఇదిలా ఉంటే  ఈచిత్రం తరువాత  అనుష్క ఇప్పటివరకు తెలుగులో  మరో సినిమాకు సైన్ చేయలేదు. అయితే కోలీవుడ్ లో  లెజండరీ డైరెక్టర్  మణిరత్నం భారీ బడ్జెట్ తో  తెరకెక్కించనున్న పొన్నియన్ సెల్వన్ లో  అనుష్క  ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు  తెలుస్తుంది. త్వరలోనే దీని గురించి ఓ క్లారిటీ రానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: