టాలీవుడ్ ఇండస్ట్రీలో మొట్టమొదటి సినిమాతోనే అదిరిపోయే హిట్ అందుకున్న రకుల్ ప్రీత్ సింగ్ తరువాత వరుసగా అవకాశాలు దక్కించుకుని తన అందచందాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసి పర్వాలేదనిపించింది. కుర్ర హీరో మరియు సీనియర్ హీరో అన్న తేడా లేకుండా ఇండస్ట్రీలో తన దగ్గరకు వచ్చిన ప్రతి మంచి అవకాశాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ వరుస విజయాలతో దూసుకెళ్లి పోయింది. స్టార్ హీరోలందరి పక్కన నటించిన రకుల్ ప్రీతి సింగ్ తర్వాత చేసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడటంతో ఇతర భాషల్లో అనగా సౌత్ ఇండస్ట్రీలో తమిళ్ లో కూడా నటించడంతో అక్కడ కూడా సరైన సక్సెస్ లేకపోవడంతో తాజాగా ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్లో అడుగుపెట్టింది.

 

అక్కడ ఇటీవల ఫస్ట్ ఛాన్స్ దక్కించుకుని పర్వాలేదనిపించింది. ఇటువంటి నేపథ్యంలో సౌత్ వైపు ఇంకా వెళ్లారా ..? సౌత్లో ఇక సినిమాలు చేయదా అంటూ వస్తున్న వార్తల విషయంలో రకుల్ ప్రీత్ సింగ్ తొందర్లోనే సౌత్ ఇండస్ట్రీ లో రెండు సినిమాలు చేయబోతున్నట్లు ఆ వివరాలు అధికారికంగా త్వరలో వెల్లడి కాబోతున్నట్లు వివరణ ఇచ్చింది. ఇదిలా ఉండగా గత కొద్ది రోజుల నుండి రకుల్ ప్రీత్ సింగ్ కి టాలీవుడ్ లో అవకాశాలు లేకపోవడంతో ఆమె హైదరాబాద్ లో తనకు గిఫ్ట్ గా లభించిన  సొంత ఇంటిని అమ్మి, బెంగుళూరు వెళ్ళిపోయి అక్కడ ఒక పెద్ద భవంతిని కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి.

 

కాగా ఆ వార్తలపై నిన్న కొంత ఘాటుగా స్పందించిన రకుల్, తనకు హైదరాబాద్ లో ఇల్లు ఎవరూ గిఫ్ట్ గా ఇవ్వలేదని, అది తాను కష్టపడి సంపాదించుకున్న ఇల్లు అని, దయచేసి ఇటువంటి తప్పుడు వార్తలు సృష్టించవద్దని తన ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ ని పోస్ట్ చేసింది రకుల్. ట్విట్టర్ అకౌంట్లో వార్నింగ్ ఇచ్చేటట్టు రకుల్ ప్రీత్ సింగ్ పోస్ట్ పెట్టడం తో ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారి సంచలనం సృష్టిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: