సూపర్ స్టార్ మహేష్, అనీల్ రావిపుడి కాంబినేషన్ లో క్రేజీ మూవీగా వస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. దిల్ రాజు, అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబందించిన మొదటి సాంగ్ మైండ్ బ్లాక్ అంటూ వచ్చింది. బాబు నీ మాస్ లుక్కు మైండ్ బ్లాంక్ అనే లిరిక్ అదిరింది.

 

ఓ పక్క పోటీగా వస్తున్న అల వైకుంఠపురములో సాంగ్స్ అన్ని థమన్ అదరగొడుతుంటే.. సీనియర్ అయిన దేవికి ఈసారి టఫ్ ఫైట్ తప్పదని తెలుస్తుంది. అందుకే సరిలేరు నీక్వ్వరు సినిమాకు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకున్నారు. మొదటిసాంగ్ మైండ్ బ్లాక్ అంటూ వచ్చి ఆడియెన్స్ మైండ్ బ్లాంక్ చేశారు.

 

దేవి దృష్టి పెట్టాలే కాని మళ్లీ అతని ఫాం లోకి రావడం ఎంతలోకి అన్నట్టుగా ఈ సాంగ్ ఉంది. అయితే మాస్ బీట్ తో వచ్చిన ఈ సాంగ్ సూపర్ స్టార్ మాస్ ఆడియెన్స్ కు తెగ నచ్చేసింది. రిలీజైన కొద్దిసేపట్లోనే ఈ సాంగ్ వైరల్ గా మారింది. 2020 జనవరి 11న మహేష్ సరిలేరు నీకెవ్వరు రిలీజ్ అవుతుంది. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాకు కథ, కథనాలే కాదు మ్యూజిక్ కూడా సెట్ అవ్వాలి. ఆ విషయంలో దేవి అదరగొట్టేస్తున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాతో మరోసారి దేవి తన సత్తా చాటాలని చూస్తున్నాడు. మైండ్ బ్లాంక్ సాంగ్ చూస్తుంటే అది నిజమయ్యేలా ఉంది. 

 

పటాస్ నుండి ఎఫ్-2 వరకు సూపర్ హిట్లు కొట్టిన అనీల్ రావిపుడి మహేష్ సరిలేరు నీకెవ్వరుతో కూడా మరో సెన్సేషనల్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ మేజర్ అజయ్ కృష్ణగా నటిస్తున్నారు. సినిమాలో విజయశాంతి, ప్రకాశ్ రాజ్ వంటి గ్రేట్ యాక్టర్స్ కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: