సూపర్ స్టార్ మహేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న చిత్రం "సరిలేరు నీకెవ్వరు". ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదల అయింది. అయిన కొద్ది క్షణాల్లోనే ఎంత్ రెస్పాన్స్ తెచ్చుకుంది ఈ టీజర్. మహేష్ బాబు చెప్పిన మాస్ డైలాగులు బాగా పేలాయి. ఈ ఒక్క టీజర్ కి ఎక్కడ లేని హైప్ వచ్చేసింది. అప్పటి వరకు ప్రచారంలో వెనకబడ్డ ఈ సినిమా ఒక్కసారిగా టాప్ లోకి దూసుకు వెళ్ళింది. అయితే పీక్స్ లో ఉన్న ప్రచారాన్ని అలానే నిలబెట్టడానికి ప్రతీ సోమవారం ఒక పాటని విడుదల చేయాలని నిర్ణయించారు.

 

ఈ రోజు సోమవారం కాబట్టి మొదటి పాటగా మైండ్ బ్లాక్ పాట రిలీజ్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాట మాస్ బీట్స్ తో యూత్ ని ఆకట్టుకునేట్టుగా ఉంది. మధ్య మధ్యలో మహేష్ బాబు డైలాగులు మరింతగా ఆకట్టుకున్నాయి. అటు పాటతో పాటు మహేష్ మాటలతో చాలా హుషారుగా సాగింది. మైండ్ బ్లాక్ అంటూ సాగిన  ఈ పాట ప్రేక్షకుల మైండ్ బ్లాక్ చేసేలా ఉందా అనేది ఒకసారి చూస్తే,

 

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటకు దేవిశ్రీ మరియు శ్రీమణి కలిసి సాహిత్యం అందించారు. ఈ పాటను పాడినవారు వారు బ్లాజ్..రనినా రెడ్డి. పాటలో కొన్ని చోట్ల డైలాగ్స్ రూపంలో మహేష్ బాబు కూడా తన గాత్రం అందించడం విశేషం. బాబూ నువ్వు సెప్పు.. ఆడ్ని కొట్టమని డప్పు" అని అడగగానే మహేష్ బాబు "నువ్వు కొట్టరా" అనడం ఆసక్తికరంగా ఉంది. " అయితే ఈ పాట మహేష్ అభిమానులు అనుకున్న అంచనాలని చేరుకోలేక పోయిందనే చెప్పాలి.

 

మాస్ బీట్స్ తో అలరించినప్పటికీ సినిమా మీద అంచనాలు విపరీతంగా ఉండడంతో ఆ స్థాయిలో లేదని తెలుస్తుంది. కాకపోతే టీజర్ లో తన మాటలతో ఎలాగైతే ప్రేక్షకులకి వినోదం పంచాడో ఈ పాటలో కూడా తన మాస్ మాటలతో వినోదాన్ని అందించాడు. ఇంకా నాలుగు సోమవారాలు నాలుగు పాటలు  విడుదల అవుతాయి కాబట్టి వచ్చే సోమవారం వరకు వెయిట్ చేద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: