తెలంగాణలో హైదరాబాద్ షాద్నగర్లో వైద్యురాలిపై అత్యాచారం హత్య ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. రేప్ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలంటూ దేశం మొత్తం నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో నిందితులకు ఉరిశిక్ష విధించాలి అంటూ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. కాగా  ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన తర్వాత దేశం మొత్తానికి చేరిన ఘటన దిశా ఘటనే.  దేశం మొత్తం దీనిపై స్పందించి నిరసనలు తెలుపుతున్నారు. ఆడ పిల్లలపై అత్యాచారాలు చేసేవారు పై అక్కడికక్కడే శిక్ష విధించేలా కఠిన చట్టాలు తీసుకరావాలని...చట్టాలను  మార్చాల్సిన సమయం ఆసన్నమైందంటూ దేశ ప్రజలందరూ డిమాండ్ చేస్తున్నారు. 

 


 అంతేకాకుండా ఈ  విషాద ఘటన పై ఎంతో మంది రాజకీయ సినీ ప్రముఖులు అందరూ తీవ్రంగా స్పందిస్తూ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. సామాన్యుల మొదలుకొని బాలీవుడ్ సెలబ్రిటీలు టాలీవుడ్ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు అందరూ ఈ ఘటనపై తీవ్రంగా  స్పందించారు. అయితే ఈ ఘటనపై ఇప్పటివరకు అల్లు అర్జున్ మాత్రం స్పందించలేదు. అయితే గత కొన్ని రోజులుగా ఈ అంశంపైనే దేశంలో అందరూ స్పందించి నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తుంటే...  దీనిపై అల్లు అర్జున్ మాత్రం  స్పందించలేదు... కానీ అదే సమయంలో తన  మూవీ అల వైకుంఠపురంలో సినిమా ప్రమోషన్స్ గురించి రియాక్ట్ అయ్యారు. అల వైకుంఠపురం సినిమాలోని సామజవరగమనా పాట ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలిసిన విషయమే. అయితే  ఈ పాటకు సంబంధించి అల్లు అర్జున్ ఓ ట్విట్  పెట్టారు. 

 


 ప్రస్తుతం అల్లు అర్జున్ పెట్టిన ట్వీట్ తో నెటిజన్ల  ఆగ్రహానికి గురయ్యారు అల్లు అర్జున్. సామజవరగమనా పాట 100 మిలియన్స్ వ్యూస్ వచ్చాయని  అంటూ ఇది ఆల్ టైం రికార్డు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు టాలీవుడ్ హీరో అల్లు అర్జున్. కాగా అల్లుఅర్జున్ పోస్ట్ పై అందరూ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. దిశా  కేసు ఘటనలో దేశమంతటా స్పందిస్తూ  నిందితులకు శిక్షలు పడాలంటు  అందరు స్పందిస్తుంటే... ఒక బాధ్యతగల దేశ పౌరుడిగా కనీసం మీరు స్పందించరా మీరు... మీకు అసలు సమాజంలోని విషయాల గురించి అవసరం లేదా అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: