తెలుగులో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన సాయిధరమ్ తేజ్ గత కొంత కాలంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. ఆ మద్య వచ్చిన చిత్ర లహరి కాస్త పరవాలేదు అనిపించు కుంది. ఈ మూవీ కంటెంట్ పరంగా తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చింది. దాంతో హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఫ్యామిలీ నేపథ్యంలో వచ్చే మూవీస్ కి మంచి ఆదరణ వస్తుంది.. దాంతో ఇలాంటి మూవీస్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానంటున్నాడు ఈ కుర్రమెగా హీరో. సుప్రీం హీరో సాయి తేజ్ హీరోగా మారుతి దర్శకుడిగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో, బన్నీ వాస్ నిర్మాతగా రూపొందిస్తున్న మూవీ ‘ప్రతిరోజూ పండగే’ ఈ మూవీ డిసెంబర్ 20న విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్, సాంగ్స్ కి మంచి ఆదరణ లభిస్తుంది.
సత్యరాజ్ కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమాను ఈ నెల 20వ తేదీన విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఫుల్ బిజీగా ఉంది. కాగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ డిసెంబర్ 4న విడుదల కానుంది. పల్లెటూరి నేపథ్యంలో సాగే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. గతంలో ఈ జంట నటించిన ‘సుప్రీం’ సినిమాలో కలిసి నటించడం జరిగింది.
ఇక మిగిలిన కీలక పాత్రల్లో సత్యరాజ్, విజయ కుమార్, రావ్ రమేష్, మురళీ శర్మ తదితరులు నటిస్తుండగా, ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథపై అందరిలోను ఆసక్తి వుంది. గతంలో ఈ తరహా మూవీస్ కి తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఉమ్మటి కుటుంబ కథా చిత్రాలు అంటే తెలుగు ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటారు. మరి సెంటిమెంట్ తో వస్తున్న ఈ మూవీ సాయిధరమ్ తేజ్ కి హిట్ ఇస్తుందా లేదా చూడాలి.