యాంకర్ శ్రీముఖి... అప్పటివరకు తెలుగు ప్రేక్షకులకు అంతంతమాత్రంగానే తెలిసిన ఈ అమ్మడు  ఈటీవీ ప్లస్ లో ప్రసారమయ్యే... పటాస్ షో ద్వారా ఎక్కడలేని ఇమేజ్ ని  సంపాదించుకున్న ఈ అమ్మడు కొన్ని  రోజుల్లోనే ఒక రేంజ్లో ఫేమస్ అయిపోయింది. ఇక పటాస్ షో లో తనదైన యాంకరింగ్ తో అదరగొట్టింది శ్రీముఖి. రవి కి జోడీగా శ్రీముఖి చేసే అల్లరి మామూలుగా ఉండేది కాదు. బుల్లితెరపై కామెడీ షో లోనే కొత్త ట్రెండ్ సృష్టించింది పటాస్ షో. ఇక అందులో రవి శ్రీముఖి యాంకరింగ్ గురించి అయితే కొత్తగా చెప్పాల్సిన పనిలేదు రచ్చరచ్చ చేసేవారు. పటాస్ లో యాంకర్ రవి చేసిన పంచ్ లకు స్పాంటేనియస్ గా  కౌంటర్ ఇస్తూ శ్రీముఖి అందరిని అలరిస్తుంది. పటాస్ ప్రోగ్రాం ద్వారానే కాకుండా ఎన్నో సినిమా ఈవెంట్లు... ఆడియో లాంచ్ లు  అంటూ తెగ బిజీగా ఉండేది. 

 

 

 

 ఎప్పుడూ ఎంతో బిజీగా ఉండే ఈ అమ్మడు  బిగ్ బాస్  షో లోకి ఎంట్రీ ఇచ్చింది. వంద రోజుల పాటు ఉండేందుకు  నిశ్చయించుకొని బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది శ్రీముఖి. అనుకున్నట్టుగానే బిగ్ బాస్  లో వంద రోజులకు పైగానే షోలో కొనసాగింది. అయితే ఈ అమ్మడు బిగ్ బాస్ లో కూడా బాగానే రచ్చరచ్చ చేసేసింది . టాస్క్ లో కాంట్రవర్సీ లతో ప్రేక్షకులను అలరించింది శ్రీముఖి. అయితే బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా శ్రీముఖి నిలుస్తుందని అందరూ అనుకున్నారు కానీ కొంచెం లో మిస్ అయిపోయిందా. అయితేనెం  బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన రాహుల్  సిప్లిగంజ్  35 లక్షలు మాత్రమే వస్తే శ్రీముఖి రెమ్యూనరేషన్ కింద అంతకుమించిన ఇన్కమ్ వచ్చిందని సమాచారం. అయితే బిగ్ బాస్  హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ అమ్మడు మళ్లీ బిజీ అయిపోయింది. కానీ ఇచ్చిన మాట మర్చిపోయినట్లు కనిపిస్తుంది. 

 

 

 బిగ్ బాస్ షోలో తనకు ఇచ్చిన సపోర్ట్ చూసి తనకు ఓటు వేసిన వాళ్ళందరికీ రుణం తీర్చుకోగలను అంటు ఎమోషన్ అయింది శ్రీముఖి. అందరిని కలిసి ప్రత్యేక థాంక్స్ మీట్  కూడా ఏర్పాటు చేస్తానంటూ శ్రీముఖి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కార్యక్రమంలో చెప్పుకొచ్చింది. అటు బిగ్ బాస్ విన్నర్ అయిన రాహుల్ మాట ఇవ్వకపోయినా రాహుల్ సిప్లిగంజ్ మాత్రం తనకు ఓట్లు వేసిన  అభిమానుల గురించి  లైవ్ షో ఏర్పాటు చేసి మరీ థ్యాంక్స్ చెప్పారు. కానీ  తనకు ఓట్లు వేసి గెలిపించిన అభిమానులతో థాంక్స్ మీట్ ఏర్పాటు చేస్తానని చెప్పిన శ్రీముఖి మాత్రం బిజీ అయిపోయింది. దీంతో నెటిజన్లు శ్రీముఖి అభిమానులను మర్చిపోయింది అంటూ సెటైర్లు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: