సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం "సరిలేరు నీకెవ్వరు ".  మహేష్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.  ఇప్పటికీ సినిమా టీజర్ రికార్డులు సృష్టిస్తుంది. టీజర్ తో ఈ సినిమా పై అంచనాలు ఒక్క సారిగా పెరిగిపోయాయి. అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈసినిమా సంక్రాంతికి విడుదలవుతుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ఇక ఈ సినిమా ప్రమోషన్స్  విషయంలో వెనకబడిందని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే విడుదలైన  ఒక్క టీజర్ తో  విమర్శకుల నోర్లు మూయించారు చిత్రయూనిట్. ప్రతి మండే సాంగ్స్ ఒక్కొక్కటిగా విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ఇప్పటికే  ప్రకటించింది . చెప్పినట్టే ఈ సినిమా నుంచి లిరికల్ సాంగ్ ను విడుదల చేసారు.

 
"మైండ్ బ్లాక్ మైండ్ బ్లక్ బాబు నీ మాస్ లుక్ బైండ్ బ్లాకు"  అంటూ సాగే ఈ పాట అభిమానులను ఆకట్టుకుంటుంది.  మహేష్ బాబు నుంచి అభిమానులు కోరుకుంటున్న మాస్ మసాలాను దేవిశ్రీ ఈ పాటతో అందించాడు. ఈ సాంగ్ వింటుంటే మహేష్ పాట లో మాస్ లుక్ లో కనిపిస్తాడని అర్ధమవుతుంది. ఈ సినిమాలో మహేష్ ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ గా నటిస్తున్నవిషయం తెలిసిందే.

ఇక ఈ సినిమాలో మహేష్ కు జోడిగా ముద్దుగుమ్మ రష్మిక మందన నటిస్తుంది.  ప్రకాష్ రాజ్ , లేడి బాస్ విజయశాంతి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక దర్శకుడు అనీల్ రవిపూడి మహేష్ అభిమానులు ఎం కోరుకుంటున్నారో సినిమాలో అన్నింటిని ఉండేలా చేసుకుంటున్నాడని టాక్.  ముఖ్యంగా మహేష్ బాబును మాస్ గా చూడాలనుకుంటున్న అభిమానులకు ఈ సినిమాతో ఆ కోరిక తీరేలా కనిపిస్తుంది.  యువతను ఉర్రూతలూ ఊగిస్తున్న ఈ మాస్ మైండ్ బ్లాక్ సాంగ్ పై మీరు ఓ లుక్కెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి: