చిరంజీవి..మెగాస్టార్ చిరంజీవిగా ఎదిగారంటే అందులో అల్లు అరవింద్ లక్కీ హ్యాండ్ ఉందని ఒప్పుకోవాల్సిందే. ఆయనతో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీసి బ్లాక్ బస్టర్స్ ని అందుకోవడమే కాదు చిరుని ఈ స్థాయి చేరుకునేలా అన్నీ రకాలుగా సపోర్ట్ చేశారు. ఇప్పుడు అలానే ఆయన కొడుకు అల్లు అర్జున్ తో పాటు మెగా హీరోలని తన నిర్మాణ సంస్థలో అధిరిపోయో ఆఫర్స్ ఇస్తున్నారని తాజా సమాచారం. మెగా ఫ్యామిలికి బాస్ లాంటి అల్లు అరవింద్ బిజినెస్ స్ట్రాటజీ.. మాస్టర్ మైండ్ గురించి అందరికి తెలిసిందే. వారసులిద్దరితో గీతా ఆర్ట్స్ సంస్థలో సినిమాలు నిర్మిస్తున్న అరవింద్ రామాయణం 3డిని ట్రయాలజీగా రూపొందించే ప్రణాళికల్లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థతో కలిసి అల వైకుంఠపురములో సినిమాని నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని 2020 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు.

 

ఓవైపు భారీ సినిమాలలో భాగస్వాములతో కలిసి నిర్మిస్తూనే.. యంగ్ హీరోలతోనూ జీఏ 2 సంస్థలో బన్ని వాస్ తో కలిసి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాల్ని నిర్మిస్తున్నారు. సాయిధరమ్ తేజ్ ని పిల్లా నువ్వు లేని జీవితం సినిమాతో తెరకు పరిచయం చేసిన అల్లు అరవింద్ ఇప్పుడు ప్రతి రోజు పండగే సినిమాతో మరో ఛాన్స్ ఇచ్చారు. మారుతి దర్శకత్వంలో జీఏ2 బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈనెల 20న ప్రతి రోజు పండగే రిలీజ్ కానుంది. అరవింద్ మరోసారి మెగా మేనల్లుడికి బ్రేక్ ఇస్తారనే టాక్ ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది.

 

సినిమా తర్వాత అరవింద్ తాజాగా రూపొందించిన ప్రణాళికల్ని వెల్లడించారు. 2020లో సాయి తేజ్ హీరోగానే మరో సినిమాని నిర్మించనున్నామని ప్రకటించారు. దాంతో పాటే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగాను ఒక సినిమాని నిర్మిస్తామని తెలిపారు. గీతా అధినేతకు వరుణ్ తేజ్ తో ఇదే మొదటి సినిమా. కొత్త సంవత్సరంలో అధికారికంగా ప్రకటించబోతున్నారట. దీన్ని బట్టి చూస్తే మెగా హీరోలకు అల్లు అరవింద్ 2020లో కొత్త సంవత్సర కానుకల్ని అందిస్తున్నారని తెలుస్తోంది. ఇక అల్లు అరవింద్ మెగాస్టార్ తోను ఒక సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారని ఆ విషయం కూడా 2020 లో వెల్లడిస్తారని మరో ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: