అరుంధతి సినిమా నుండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో అనుష్క కి క్రేజ్ ఊహించని రీతిలో వచ్చేసింది. ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా కథ తయారు చేసుకోవాలంటే దర్శక, రచయితలు ఆ పాత్రకు సరిపడా హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అని ముందు ఆలోచించేవాళ్ళు. కానీ ఆ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అనుష్క ని మైండ్ లో పెట్టుకొనే కథలు తయారయ్యాయి. ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా అంటే వన్ అండ్ ఓన్లీ చాయిస్ అనుష్క మాత్రమే. ఇక కొన్ని కథలు కొందరు స్టార్స్ దగ్గరికి వెళ్లి చివరికి రాసిపెట్టి ఉన్న స్టార్ చేతిలో పడటం ఇండస్ట్రీలో సహజమే. 

 

లేటెస్ట్ గా 'నిశబ్దం' విషయంలోనూ అదే జరిగిందని తాజా సమాచారం. అవును ఈ సినిమాను అనుష్క కంటే ముందు మరో హీరోయిన్ తో ప్లాన్ చేసాడట కోన వెంకట్. ముందుగా అనుకున్న హీరోయిన్ డేట్స్ కుదరలేదని - ఇక సినిమా డిలే అవుతూ రావడం వల్ల ఆ అమ్మాయి వేరే కమిట్ మెంట్స్ ఉన్నాయని చెప్పేసిందట. ఇక సినిమా అంతా యూ.ఎస్ లోనే షూట్ అనుకోవడంతో మరో స్టార్ హీరోయిన్ కోసం వెయిట్ చేసామని అదే సమయంలో అనుష్క కి ఎయిర్ పోర్ట్ లో కథ వినిపించడంతో తను వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వెల్లడించాడు.

 

అయితే ఎయిర్ పోర్ట్ లో ఫ్లైట్ ఆలస్యం అవ్వడం వల్ల అనుష్క కోనా వెంకట్ పక్కనే కుర్చుందట. ఆ సమయంలో స్వీటీని ఇంప్రెస్ చేసి ఈ సినిమాకు ఒప్పించేసాడట కోనా. అయితే అప్పుడు సరిగ్గా ఏమైందో చెప్తే ఒక సినిమా తీయొచ్చని అన్నాడు. సో అలా ఒక హీరోయిన్ చేయాల్సిన సినిమా స్వీటీ చేతిలో పడిందని ఈ సందర్భం చూస్తే అర్థమవుతోంది. మరి నిశబ్దం కి ముందు అనుకున్న ఆ హీరోయిన్ ఎవరనేది కోన చెప్పకపోవడం తో ఈ విషయంలో సస్పెన్స్ నెలకొంది. ఇక 'నిశబ్దం' లో అంజలి, అర్జున్ రెడ్డి ఫేం శాలిని పాండే కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తమిళ నటుడు మాధవన్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో అనుష్క బ్లైండ్ క్యారెక్టర్ పోషిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: