‘నాపేరు సూర్య’ లాంటి దారుణమైన డిజాస్టర్ సినిమా తర్వాత నిరుత్సాహం చెందిన అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా చేయడానికి చాలా టైం తీసుకున్నారు. ఆ టైంలో చాలా కథలు విని చివరాకరికి గతంలో తనకు 2 బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పిన స్టోరీ 'అలా వైకుంఠపురం లో' సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సినిమా స్టార్ట్ చేసి చాలా త్వరగా కంప్లీట్ చేసి  రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇదిలా ఉండగా సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు పాటల రూపంలో ముందు నుండే చాలా తెలివిగా ఒక్కొక్క సాంగ్ రిలీజ్ చేసిన సినిమా యూనిట్… సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేసింది. విడుదలైన పాటలు సోషల్ మీడియాలో మరియు యూట్యూబ్ లో రికార్డ్ ల మీద రికార్డ్ లు నెలకొల్పాయి.

 

ముఖ్యంగా సినిమా లో రిలీజైన ఫస్ట్ సాంగ్ ‘సామజ వర గమన’ అదిరిపోయే రీతిలో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడంతో పాటు సంగీత ప్రియులను మరియు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సాంగ్ సరికొత్త రికార్డును నెలకొల్పింది. థమన్ స్వరకల్పనలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రచన, గాయకుడు సిద్ శ్రీరామ్ ఆలపించిన “సామజవరగమన” సాంగ్ 10కోట్ల వ్యూస్, 10లక్షల లైక్స్ తో రికార్డ్ క్రియేట్ చేసింది.

 

దక్షిణాది మూవీస్ లో ఫస్ట్ టైమ్ అల .. వైకుంఠపురం లో ..” మూవీ సాంగ్ ఆ ఘనతను సాధించింది. దీంతో సినిమాపై అంచనాలు విపరీతంగా పెంచేసుకున్నారు అల్లు అర్జున్ అభిమానులు. అంతేకాకుండా ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ టబు మరియు అక్కినేని సుశాంత్ నటించడంతో సినిమాపై ఇండస్ట్రీలో కూడా ఆసక్తి నెలకొంది. ఒకపక్క ఈ సినిమాతో కచ్చితంగా త్రివిక్రమ్ బన్ని కాంబినేషన్ హ్యాట్రిక్ కొట్టడం గ్యారెంటీ అని అభిమానులు అంటున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తారీకున భారీ ఎత్తున ఈ సినిమా రిలీజ్ కానుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: