సినీ రచయిత, దర్శకుడు, నటుడు పోసాని కృష్ణ మురళి ఏ విషయం మాట్లాడినా అదో పెద్ద సంచలనం అవుతుంది. యమాఘాటుగా అందరిని విమర్శిస్తుంటారు. ఇప్పుడు అదే చేశారు. ప్రపంచ వ్యాప్తంగా భారతదేశం అంత చెడిపోయిన దేశం మరోటి లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పోసాని. దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన వెటర్నరీ డాక్టర్ దిశ హత్య, రేప్ ఘటనలో నిందితులైన ఆ నలుగురు యువకులు పెద్ద క్రిమినల్స్ కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశం చాలా మంచిదే.. కాని మన దేశంలో ఉన్న క్రైమ్, అవినీతి ఎక్కడా లేదు... ముందుగా ప్రజా వ్యవస్థ నీతిగా ఉండాలి..కానీ ఆ వ్యవస్థే నీతిగా లేదు. 

 

రాజకీయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, ఉద్యోగ వ్యవస్థ...ఇలా ఏ ఒక్కటీ నీతి నిజాయితిగా లేదు. సమాజంలో ఉన్న ఎవడూ నీతిగా ఉండకుండా సమాజం నీతిగా ఉండాలంటే ఎలా..? రేప్ చేశారు కాబట్టి చంపేయండి అంటే ఇప్పుడు ప్రయోజనం లేదు. ఈ నలుగుర్నే చంపుతారు.. ఇలాంటి వాళ్లు కోట్లలో ఉన్నారు. మరి వాళ్ళ సంగతేంటని ఘాటుగా స్పందించారు. మనం రాజకీయ నాయకులను ఎటువంటి వారిని ఎన్నుకుంటున్నామూ.. ఎలాంటి వాళ్లను మనం పోలీస్‌లుగా నియమించుకుంటున్నాం. ఎలాంటి వాళ్లకు ఉద్యోగాలు ఇస్తున్నాం.. ఎలాంటి వాళ్లను బాబాలుగా కొలుస్తున్నాం.. వీటన్నింటిపై మనకు మనం క్వచ్ఛన్ వేసుకుంటే ఆన్సర్ దొరికేస్తోంది. వీళ్లతో పోల్చుకుంటే దిశాని రేప్ చేసి మర్డర్ చేసిన నిందితులు పెద్ద క్రిమినల్స్ కాదనేది నా లెక్క. 

 

ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేశారు. ఉరి వేస్తే చచ్చిపోతారు. కాని అవినీతి, అక్రమాలు, రేప్‌లు జరుగుతూనే ఉంటాయి. వ్యవస్థ నీతిగా ఉంటే క్రైమ్ జరగకుండా ఉంటుంది. తప్పు జరిగినప్పుడు ఉరి తీయడం లాంటివి అరబ్ కంట్రీస్‌లో చూస్తుంటాం. అవన్నీ వేస్ట్ అనేది నా అభిప్రాయం...అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు పోసాని. పోసాని మాట్లాడిన దాంట్లో వాస్తాలున్నాయని కొందరంటుంటే కొందరు మాత్రం ఆయన మాటలని తీవ్రంగా ఖండిస్తున్నారు. రివర్స్ లో ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: