మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి అనే యువ దర్శకుడితో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యంలో మంచి యాక్షన్ మరియు ఎంటర్టైన్మెంట్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పకులుగా వ్యవహరిస్తుండగా ఆయన తనయుడు అల్లు వెంకటేష్ తొలిసారిగా నిర్మాతగా మారి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. యువ సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ స్వరాలు అందిస్తున్న ఈ సినిమాకు జార్జ్ విలియమ్స్ ఫోటోగ్రఫిని మరియు ప్రముఖ ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ ని అందిస్తున్నారు. 

 

ఇకపోతే ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కథ విషయమై నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి ఒక వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. దాని ప్రకారం, ఈ సినిమా కథ, గతంలో పవన్ కళ్యాణ్ హీరోగా మరియు దర్శకుడిగా మారి తెరకెక్కించిన జానీ సినిమా కథను పోలి ఉంటుందని, అలానే ఆ సినిమా మెయిన్ ప్లాట్ నే తీసుకుని దర్శకుడు కిరణ్ ఈ తాజా సినిమా కథ రాసుకున్నాడని అంటున్నారు. అయితే అప్పట్లో పవన్ తొలిసారి దర్శకత్వం వహించిన ఆ సినిమా ఘోరంగా ఫ్లాప్ కావడంతో పాటు పవన్ కు కూడా కెరీర్ పరంగా కొన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టింది. 

 

ఇక ప్రస్తుతం తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాత్రం, జానీ మాదిరిగా తప్పులు లేకుండా ఫుల్ లెంగ్త్ పర్ఫెక్ట్ గా దర్శకుడు కథను సిద్ధం చేసాడని, తప్పకుండా రేపు రిలీజ్ తరువాత ఈ సినిమా మంచి సక్సెస్ సాధించడం ఖాయం అని సమాచారం. అయితే ప్రస్తుతం విరివిగా ప్రచారం అవుతున్న ఈ వార్తపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది. ఇక ఇటీవల గద్దలకొండ గణేష్ అనే మాస్ సినిమాతో ప్రేక్షకుల ముందు వచ్చి సూపర్ హిట్ కొట్టిన వరుణ్, ఈ సినిమాతో ఎంతవరకు సక్సెస్ ని అందుకుంటాడో చూడాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: