రాణి ముఖర్జీ యొక్క మర్దానీ 2 ట్రైలర్ తన అద్భుతమైన కథాంశంతో దేశాన్ని ఆకట్టుకుంది. ఈ థ్రిల్లర్ సినిమా మహిళలను లక్ష్యంగా చేసుకున్న ఒక క్రూరమైన రేపిస్టును పట్టుకోవడానికి రాణి చేసే సాహసాలను చూపిస్తుంది. మర్దానీ 2 సినిమా ప్రకారం భారతదేశంలో యువత హింసాత్మక నేరాల వైపు దృష్టి పెడుతుంది. ఈ పరిణామాలు యువతుల పై పొంచివున్న ముప్పు గురించి ఖచ్చితంగా సంభాషణకు దారితీస్తాయి.
రోజు రోజు కి మహిళల పై పెరుగుతున్న బెదిరింపులు మరియు ప్రతి రోజు బాలికలు ఎదుర్కొంటున్న నమ్మశక్యంకాని ముప్పును ఎత్తిచూపడానికి, ఇటీవల జరిగిన బాల్య నేరాల కేసులను ప్రదర్శించడానికి రాణి భారతదేశంలోని అగ్రశ్రేణి టీవీ ఛానెళ్లలో వార్తా వ్యాఖ్యాతగా ప్రవేశించనున్నారు
మర్దానీ 2 సినిమా భారతదేశంలో రోజు రోజు కి మహిళల పై యువత చే పెరుగుతున్న ఘోర నేరాలను ఎత్తి చూపుతుంది. యువత చే మహిళల పై వేగంగా పెరుగుతున్న హింసాత్మక నేరాలు తీవ్రమైన సామాజిక ముప్పు అని ఈ ముప్పు ను సమాజం దృష్టికి తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తాను అని రాణి అన్నారు. సినిమా ప్రచారంలో భాగంగా, దేశవ్యాప్తంగా జరుగుతున్న దిగ్భ్రాంతికరమైన నేరాల కేసులను చదవడానికి నేను దేశంలోని అతిపెద్ద న్యూస్ ఛానెల్లో న్యూస్ యాంకర్గా ప్రవేశిస్తానను అని ఆమె అన్నారు.
మర్దానీ 2 సినిమా లో నిర్భయమైన మరియు నిబద్ధత కలిగిన పోలీసు సూపరింటెండెంట్ శివానీ శివాజీ రాయ్ పాత్రలో రాణి కనిపించబోనున్నారు. ఆమె సూపర్హిట్ మరియు ప్రేక్షకుల నుండి అత్యంత ప్రశంసలు పొందిన ప్రీక్వెల్ మర్దానీలో గొప్ప ప్రదర్శన ఇచ్చారు , దీనిలో ఆమె పిల్లల అక్రమ రవాణా రాకెట్ కేసును ఛేదించారు. మర్దానీ 2 లో, రాణి యువతులను అత్యాచారం చేసి హత్య చేస్తున్న పశ్చాత్తాపం లేని సీరియల్ కిల్లర్తో తలపడబోనుంది. ఆదిత్య చోప్రా నిర్మించిన, మార్దానీ 2 ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 13 న థియేటర్లలోకి రానుంది.