ఆంధ్రప్రదేశ్ లో తెలుగు మీడియం రద్దును వ్యతిరేకిస్తూ తీవ్ర ఉద్యమం చేస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాన్ని ముఖ్యంగా జగన్ ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే అనూహ్యంగా నిన్న పవన్ టాలీవుడ్ హీరోలను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయడం అత్యంత ఆశ్చర్యంగా మారింది. 

నిన్న తిరుపతిలో ‘తెలుగు విజయం’ పేరిట జరిగిన తెలుగు భాషా వేత్తల కార్యక్రమంలో మాడసాని మోహన్ లాంటి అనేక తెలుగు భాషా వేత్తలు తెలుగు పండితులు పాల్గొన్న కార్యక్రమంలో ఆవేశ పూరితంగా మాట్లాడిన పవన్ మాటలు టాలీవుడ్ హీరోలను టార్గెట్ చేసాయి. ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తెలుగు మాట్లాడటం సరిగా రానివారు కనీసం తెలుగు చదవడం వ్రాయడం రానివారు కూడ హీరోలుగా చలామణి అవుతున్నారు అంటూ పవన్ సంచలన వ్యాఖ్యలు చేసాడు. 

‘తెలుగు సినిమా బూతులకు తిట్లకు పడిపోయింది’ అంటూ పవన్ కళ్యాణ్ ఉద్వేగపూరితంగా కామెంట్స్ చేయడం ఇండస్ట్రీ వర్గాలను కూడ ఆశ్చర్య పరుస్తోంది. సాధారణంగా తన తోటి హీరోల పై అదేవిధంగా ఇండస్ట్రీ పై ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడు. అయితే పవన్ రాజకీయనాయకుడుగా మారిన తరువాత హీరోలను టార్గెట్ చేస్తూ కామెంట్ చేయడం ఎవరికీ అర్ధంకాని విషయంగా మారింది. 

పవన్ మళ్ళీ సినిమాలలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న సమయంలో అతడి నోటి వెంట ఇలాంటి వ్యాఖ్యలు హీరోలను టార్గెట్ చేస్తూ ఎందుకు వచ్చాయో ఎవరికీ అర్ధంకాని విషయంగా మారింది. పవన్ రాజకీయాల బాట పట్టి ఎన్నికలలో పోటీ చేస్తున్న సమయంలో అతడి కుటుంబ సభ్యులు తప్ప ఇండస్ట్రీలోని మరెవ్వరు పవన్ కు సపోర్ట్ గా రాలేదు. దీనితో ఈ విషయం మనసులో పెట్టుకుని పవన్ ఇలా కామెంట్ చేసి ఉంటాడు అని అంటున్నారు. పవన్ వ్యాఖ్యలకు చాలామంది హీరోలు కూడ కలత చెందుతున్నట్లు టాక్..

 

మరింత సమాచారం తెలుసుకోండి: