టాలీవుడ్ లోకి సీతాకోకచిలుక మూవీతో బాల నటుడిగా రంగ ప్రవేశం చేసిన అలీ స్టార్ కమెడియన్ గా ఎదిగాడు.  మద్యలో కొన్ని సినిమాల్లో హీరోగా కూడా నటించారు.  అయితే హీరోగా నటించి కెరీర్ ఇబ్బందుల్లో పడేసుకోకుండా కమెడియన్ గా కూడా చేస్తూ ముందుకు సాగాడు.  ప్రస్తుతం బుల్లితెరపై కూడా తన సత్తా చాటుతున్నాడు అలీ.  ఇక తెలుగు టెలివిజన్ రంగంలో వినూత్న మార్పు తీసుకువచ్చింది జబర్ధస్త్ కామెడీ షో.  ఎంతో మంది ఔత్సాహిక కళాకారులను వెలుగు లోకి తీసుకు వచ్చింది జబర్ధస్త్. ఈ కామెడీ షో ద్వారా అందమైన ఇద్దరు యాంకర్లు అనసూయ, రష్మీ బుల్లితెరకు పరిచయం అయ్యారు.

 

ప్రస్తుతం ఈ భామలు వెండితెరపై కూడా వెలిగిపోతున్నారు.  ఇక జబర్ధస్త్ మొదలై ఏడేళ్లు అవుతుంది.  అప్పటి నుంచి నాగబాబు, ఎమ్మెల్యే రోజా ఇద్దరు జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు.  ఈ మద్య జబర్ధస్త్ ఎన్నో మార్పులు చేర్పులు అవుతున్నాయి.  ఈ నేపథ్యంలో మెగాబ్రదర్ నాగబాబు జబర్ధస్త్ నుంచి బయటకు వచ్చేసిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు మరికొంత మంది నటులు కూడా బయటకు వచ్చినట్లు సమాచారం.  ఇదిలా ఉంటే నాగబాబు స్థానంలో మొదట బండ్ల గణేష్ వస్తారని అనుకున్నారు.  కానీ గతంలో రోజాతో వచ్చిన గొడవల కారణంగా ఆయన కాదని తేలింది. ఇక సీనియర్ నరేష్ అనుకున్నారు..కానీ అది ఇంకా కన్ఫామ్ కాలేదు.

 

బుల్లితెరపై తనదైన మార్క్ చాటుకుంటున్న అలీ జబర్ధస్త్ కి జడ్జీగా వస్తారని వార్తలు వస్తున్నాయి. గతంలో రోజా, అలీ ‘ఘటోత్కజుడు’ మూవీలో కలిసి నటించారు.  ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో వీరిద్దరు కలిసి నటించిన విషయం తెలిసిందే.  రోజా, అలీ ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్నారు.  అన్ని కలిశాయి.. ఈ ఇద్దరు జబర్ధస్త్ కి జడ్జీలుగా వస్తారని అంటున్నారు.  మొత్తానికి జబర్ధస్త్ ఇప్పుడు మరో కొత్త లోకంలోకి వెళ్తుందని అంటున్నారు. నటులు కూడా కొత్తవారు వస్తారని అంటున్నారు. ఇది ఎంత వరకు నిజమో కానీ..అలీ వస్తే జబర్ధస్త్ కి మంచి సందడి వస్తుందని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: