అక్కినేని నాగార్జున కుమారుడుగా ఇండస్ట్రీకి పరిచయమైన అఖిల్. చిన్నప్పుడే సిసింద్రీ సినిమా తో అందరిని ఆకట్టుకున్నాడు. పెద్ద అయిన తర్వాత ఈ కుర్ర హీరో తన తొలి సినిమాతో ఘోర వైఫల్యం మూటగట్టుకున్నాడు. ఈ సినిమాతో హీరో నితిన్ చాలా నష్టపోయాడు. ఆ తర్వాత నటించిన హలో చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందిన కూడా కలెక్షన్లకు ఏ మాత్రం రాబట్టలేకపోయింది. ముచ్చటగా మూడో సినిమా మిస్టర్ మజ్ను తీసాడు ఆ సినిమా కూడా ఆడలేదు.

 

 దీంతో నాలుగవ చిత్రం కోసం చాలా గ్యాప్ తీసుకున్నాడు ఈ యువ మన్మధుడు. చాలా గ్యాప్ తర్వాత దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కమర్షియల్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న అక్కినేని వారసుడు ఈ సినిమా మీద చాలా నమ్మకం పెట్టుకున్నాడు. ఇక అఖిల్ కి మొదటి మూడు సినిమాల్లో కూడా తన హీరోయిన్ సరిగ్గా సెట్ అవ్వలేదు అని చెప్పాలి.

 

ఇక నాలుగో చిత్రం లో హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తున్న విషయం మనందరికీ తెలుసు. చాలా రోజుల కిందటే ఈ చిత్రం షూటింగ్ మొదలైన కూడా ఈ సినిమా నుంచి ఎటువంటి ఫోటో కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు దర్శక నిర్మాతలు. కానీ ఇప్పుడు సినిమాకి సంబంధించి కాకుండా వీరిద్దరూ కలిసి కాకినాడలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఓపెనింగ్ ఇద్దరు కలిసి వెళ్లారు. అక్కడ వీరిద్దరిని పక్కపక్కన చూసిన తరువాత అక్కినేని అభిమానులు లో ఉన్న టెన్షన్ తగ్గింది.

 

వీళ్లిద్దరు కలిసి దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ ఫోటోకి మీ జోడి చాలా బాగుంది అంటూ మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. ఎట్టకేలకు మన అక్కినేని వారసుడు కి సరైన హీరోయిన్ దొరికింది అని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: