మెగాస్టార్ చిరంజీవి సైరా మూవీ రిలీజ్ అయి కూడా రెండు నెలలు గడచిపోయాయి. మొదట్లో ఈ మూవీకి విపరీతమైన హైప్ వచ్చినా కూడా ఆ తరువాత చూస్తే ఒక్క తెలుగులో తప్ప అన్ని చోట్లా అనుకున్నంతా కలెక్షన్లు లేవు. భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. దీని తరువాత మళ్ళీ చిరంజీవి ముఖానికి రంగు వేసుకుంటున్నారు.  కొరటాల శివ డైరెక్షన్లో మెగాస్టార్ చేస్తున్న మూవీ ఈ నెలలోనే పట్టాలెక్కబోతోంది.

 

ఈ మూవీకి సంబంధించి ఒక న్యూ అప్ డేట్ తెలుస్తోంది. ఈ మూవీలో మెగాస్టార్ డ్యుయల్ రోల్ వేస్తున్నారని ఇంతవరకూ జరిగిన ప్రచారం వుత్తిదేనని తేలిపోయింది. ఈ మూవీలో చిరంజీవిది ఒక్క పాత్ర మాత్రమే,  ఆయన పక్కన ఒక్క హీరోయిన్ మాత్రమేనని చిత్ర యూనిట్ గట్టిగా చెబుతున్నారు.

 

రెండవ పాత్ర గెస్ట్ రోల్ లాంటిది అయినా మూవీకి అతి కీలకమైన పాత్రట. దాన్ని రాం చరణ్ చేస్తున్నాడని టాక్. అంటే తండ్రీ కొడుకులను కలిపే మూవీగా ఇది చెప్పాలి. ఇక ఈ మూవీలో సామాజిక అంశాలతో పాటు, రాజకీయ కోణం కూడా కొంతవరకూ ఉంటుందని అంటున్నారు.

 

ఈ మూవీలో దేవాలయాలు, వాటి పరిరక్షణ వంటి అంశాల‌ మీద కధ నడుస్తుందని అంటున్నారు. ఓ విధంగా ఇది కొత్త సబ్జెక్ట్ గానే చూడాలి. మెగాస్టార్ ఇమేజ్ ని ద్రుష్టిలో పెట్టుకుని కొరటాల శివ ఈ మూవీకి అలాంటి సామాజిక అంశాన్ని సెలెక్ట్ చేశారని చెబుతున్నారు.

 

మూవీ షూటింగ్ తోందరలోనే మొదలుపెట్టి వచ్చే ఏడాది ఆగస్ట్ 14న రిలీజ్ చేయడానికి కూడా అన్నీ ఫిక్స్ చేసేశారు. ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్  సిట్టింగ్స్ ఇపుడు జరుగుతున్నాయి. చాలా కాలం తరువాత మెగాస్టార్ కి మణిశర్మ మళ్ళీ మ్యూజిక్ చేస్తున్నాడు. ఇక ఈ మూవీని 140 కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: