అనుష్క ప్రధాన పాత్రలో హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం నిశ్శబ్దం. ఇప్పటికే విడుదల అయిన టీజర్ సినిమాపై అంచనాలను పెంచింది. మాటల్లేకుండా సాగిన ఈ టీజర్ అందర్నీ ఆకర్షించింది. అనుష్కతో పాటు తమిళ నటుడు ఆర్ మాధవన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు. అనుష్క పాత్ర ఈ సినిమాలో ఛాలెంజింగ్ గా ఉంటుంది. చెవిటి, మూగ గా నటిస్తున్న అనుష్క ఆర్ట్ లవర్ గా నటిస్తుంది.

 

తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, ఇంగ్లిష్ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవబోతున్న  ఈ చిత్రం విడుదల తేదీ వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వారందరికీ తీపి కబురు తెచ్చేసింది. వచ్చే సంవత్సరం జనవరి ౩౧ వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకి సిద్ధం అవుతోంది. ఈ మేరకు చిత్ర బృందం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇంతకుముందు మంచు విష్ణు హీరోగా ‘వస్తాడు నా రాజు’ అనే సినిమా తీసి దాదాపు దశాబ్దం పాటు విరామం తీసుకున్న హేమంత్ మధుకర్ బహు భాషా నటులతో తీసిన థ్రిల్లర్ సినిమా ఇది.

 

విశ్వ ప్రసాద్, కోన వెంకట్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ ఏడాది జనవరి ౨౬ న అనుష్క నటించిన భాగమతి సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత అనుష్క చేసిన ఈ చిత్రం ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంది. అయితే అదే సెంటిమెంట్ ని నిశ్శబ్దం సినిమాకి వాడుకుంటున్నారని అర్థం అవుతుంది. భాగమతి జనవరి చివరి వారంలో రిలీజై సక్సెస్ సాధించింది కాబట్టి నిశ్శబ్దం కూడా అదే నెలలో చివరి వారంలో రిలీజ్ చేస్తున్నారు. 

 

అయితే భాగమతి లాగా నిశ్శబ్దం కూడా సూపర్ హిట్ అవుతుందా అనేది చూడాలి. కానీ అంచనాలని బట్టి, టిజర్ ని బట్టి చూస్తే ఈ సినిమా ప్రేక్షకులని తప్పక థ్రిల్ చేస్తుందని అర్థం అవుతుంది. మరి భాగమతి లాగే ఈ సినిమా కూడా హిట్ అవ్వాలని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి: