ఇటీవల జబర్దస్త్ షో నుండి తాను బయటకు వస్తున్నట్లు నాగబాబు సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దాదాపుగా ఏడేళ్ల పాటు ఆ షోలో జడ్జి గా వ్యవహరించిన నాగబాబు, షో నిర్వహక సంస్థైన మల్లెమాల లోని కొందరు టీమ్ మెంబెర్స్ యొక్క ప్రవర్తన తనకు నచ్చకపోవడం వల్లనే షో నుండి ఇలా బయటకు రావడం జరిగిందని, మధ్యలో షో పార్టిసిపెంట్స్ లో ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే, వారిని ఆదుకోవడానికి మల్లెమాల నుండి సరైన స్పందన వచ్చేది కాదని, అటువంటి ఘటనలు తనను కొంత కలిచి వేశాయని, అందుకే బయటకు వచ్చానని, ఇటీవల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా నాగబాబు ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. 

 

ఇక ఆయన తరువాత ఆ షో నుండి యాంకర్ అనసూయ భరద్వాజ్ తో పాటు చమ్మక్ చంద్ర కూడా బయటకు రాబోతున్నారు. ఇక జబర్దస్త్ షో మంచి సక్సెస్ సాధించడంలో నాగబాబు పాత్ర కూడా చాలానే ఉందని తెలుస్తోంది. ప్రతి ఒక్క పార్టిసిపెంట్ ని ఎంతో ఎంకరేజ్ చేసిన నాగబాబు స్థానంలో ఇప్పుడు ఎవరిని తీసుకోవాలి అనే దానిపై మల్లెమాల టీమ్ తలలు పట్టుకుంటోందట. ఇక ఇటీవల ఈ విషయమై ప్రముఖ కమెడియన్ ఆలీ ని  సంప్రదించగా, ఆయనకు కొన్ని కమిట్మెంట్స్ కారణంగా చేయలేనని చెప్పారట. కాగా మొన్న సీనియర్ నటుడు నరేష్ మరియు మరొక నటుడు సాయి కుమార్ లను కలిసిన మల్లెమాల సభ్యులు, వారి నుండి పిలుపు కోసం ఎదురు చూస్తున్నారట. 

 

అయితే నరేష్ కొంతవరకు సినిమాల్లో బిజీగా ఉండడం వలన ఆయన కాల్ షీట్స్ దొరక్కపోవచ్చని, కాగా సాయి కుమార్ నే ఈ షోకు జడ్జీగా తీసుకునే అవకాశం ఎక్కువగా ఉందని సమాచారం. అయితే ఈసారి జడ్జీగా తీసుకునే వ్యక్తికి కొన్ని కండీషన్స్ కూడా పెట్టాలని నిశ్చయించిందట మల్లెమాల యూనిట్. తమ అనుమతి లేనిదే ఇతర షోల్లో పాల్గొనడం, అలానే ఏవైనా ఈవెంట్స్ కి వెళ్లాలన్నా కూడా వారి పర్మిషన్ తీసుకోవాలనే కండీషన్స్ కూడా పెట్టనున్నారట. మరి ఇటువంటి కండీషన్స్ ని ఒప్పుకుని ఎవరు ఈ షోకి జడ్జీగా వస్తారో చూడాలి......!!

మరింత సమాచారం తెలుసుకోండి: