వరుస ప్లాప్స్ తో సతమతమైన  యువ సామ్రాట్ నాగ చైతన్య  ఎట్టకేలకు   ఇటీవల మజిలీ తో సూపర్ హిట్టు కొట్టి  సక్సెస్ ట్రాక్  ఎక్కాడు. ఈసినిమా  ఇచ్చిన  జోష్ తో చైతన్య వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు. అందులో  భాగంగా మజిలీ తరువాత చైతన్య , విక్టరీ వెంకటేశ్ తో కలిసి వెంకి మామ లో  నటించాడు.  డిసెంబర్ 13న విడుదలకానున్న ఈ చిత్రం పై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రం తరువాత నాగచైతన్య   ప్రస్తుతం  శేఖర్ కమ్ములతో ఓ సినిమా చేస్తున్నాడు.  ఇందులో ఫిదా  బ్యూటీ  సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఈ చిత్రం.   ఇక ఈసినిమాకు లవ్ స్టోరీ అనే  టైటిల్ ను ఫిక్స్ చేశారని  ఇటీవల వార్తలు వచ్చాయి.  ఇప్పుడు మేకర్స్  అదే టైటిల్ ను  ఫైనల్ చేశారని సమాచారం. 
 
ఈచిత్రం లో చైతూ , సాయి పల్లవి  తెలంగాణ  స్లాంగ్ లో డైలాగులు  చెప్పనునున్నారు.ఇంతకుముందు  ఫిదా సినిమాలో  కూడా సాయి పల్లవి  తెలంగాణ స్లాంగ్ తో మెప్పించగా  చైతన్య కు  మాత్రం ఈ స్లాంగ్ లో  మాట్లాడడం  ఇదే మొదటి సారి కానుంది. ఇటీవల చైతన్య పుట్టిన రోజు  సందర్బంగా ఈ చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.  దాంతో ఇప్పటికే  సినిమా కు కావల్సినంత హైప్ వచ్చింది. ముఖ్యంగా   చైతూ పాత్ర సినిమా కు హైలైట్ కానుందట. 

 
 బ్యూటిఫుల్ లవ్ స్టోరీ గా  తెరకెక్కుతున్న  ఈ చిత్రాన్ని నారాయణ దాస్ నారంగ్ ,  రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తుండగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ శిష్యుడు  పవన్  సంగీతం అందిస్తున్నాడు.  వచ్చే ఏడాది ఏప్రిల్ 2 ఈచిత్రాన్ని ప్రేక్షకులముందుకు తీసుకరానున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: