ఆటకదారా శివ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైనా హీరో ఉదయ్ శంకర్.. కౌసల్య కృష్ణ మూర్తి సినిమా ప్రేక్షకులను దగ్గరైన హీరోయిన్ ఐశ్వర్య రాజేష్.. వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేశారు. ఆసినిమానే మిస్ మ్యాచ్.. ఈ సినిమా టైటిల్ కు తగ్గట్లే సినిమాలో పాత్రలు కూడా ఎవరికీ సెట్ అయ్యేలా ఉండవు. కాకపోతే కొంచం కొత్తగా విభిన్న కథతో ఈ చిత్రం తెరకెక్కింది. అందుకే ఈ సినిమా హిట్ అవుతుందని చిత్ర యూనిట్ అభిప్రాయపడుతున్నారు. 

 

ఇది ఇలా ఉండగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే ఈ చిత్రం నుండి ఇప్పటి వరకు రిలీజ్ అయినా పోస్టర్స్, టీజర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దానితో సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరో విశేషమేంటంటే ఈ సినిమా చిన్న సినిమా అయిన కూడా కథ డిమాండింగా ఉండటంతో సినిమా పై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. 

 

తాజాగా ఈ చిత్రం యెక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఉదయ్ శంకర్, కౌసల్య కృష్ణమూర్తి ఫెమ్ ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన చిత్రం "మిస్ మ్యాచ్".. సలీమ్ ఫెమ్ నిర్మల్ కుమార్ దర్సకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. సాఫ్ట్ వేర్ అబ్బాయి, బాక్సర్ అమ్మాయి తో ప్రేమలో పడితే ఎలాంటి బాధలను పడతాడు. ఫ్యామిలీని పెళ్ళికి ఎలా ఒప్పిస్తాడు అన్నది ఈ సినిమా కథ. కాగా, ఇటీవల విడుదల అయిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే సోమవారం ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. 

 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సినీ నటుడు వెంకటేష్, దర్శకుడు రాఘవేంద్ర, మంత్రి హరీష్ రావు, సిరివెన్న సీతారామ శాస్త్రి హాజరయ్యారు. కొత్త రకం ప్రేమ కథను చూపించబోతున్న చిత్రాంబృందానికి శుభాకాంక్షలు.. సినిమా బాగుంది అని అక్కడికి వచ్చిన అతిధులు ప్రశంసలు కురిపించారు.  అందరి మన్ననలు పొందిన ఈ చిత్రం పై చిత్ర యూనిట్ భారీ అంచనాలనే పెట్టుకుంది. ఈ సినిమా డిసెంబర్ 6 వ తేదీన విడుదల కానుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: