సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు, అనిల్ సుంకర నిర్మాతలుగా సరిలేరు నీకెవ్వరు సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. మహేశ్ బాబుకు జోడీగా రష్మిక మందన్న నటిస్తోండగా దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. సరిలేరు నీకెవ్వరు సినిమా నుండి మైండ్ బ్లాక్ అనే పాట విడుదలయింది. ఈ పాట విన్న ప్రేక్షకులకు నిజంగానే మైండ్ బ్లాక్ అయింది. 
 
మహేశ్ ఫ్యాన్స్ పైకి ఈ పాట బాగుందని చెబుతున్నప్పటికీ సాధారణ ఫ్యాన్స్ మాత్రం ఈ సాంగ్ ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు సినిమా నుండి విడుదల చేసిన మైండ్ బ్లాక్ పాట ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు. మరోవైపు ఈ సినిమాకు పోటీగా విడుదలవుతున్న అల వైకుంఠపురములో సినిమా నుండి ఇప్పటికే మూడు లిరికల్ వీడియోలు విడుదలయ్యాయి. 
 
సామజవరగమన, రాములో రాములా పాటలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఈ పాట విన్న తరువాత నిజంగానే మైండ్ బ్లాక్ అయిందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. మిగతా పాటల విషయంలోనైనా కేర్ తీసుకోమని సూచిస్తున్నారు. కొందరు ఫ్యాన్స్ మాత్రం ఈ పాట శైలజ శైలజ పాటను పోలి ఉందని కామెంట్లు చేస్తున్నారు. కొందరు ఫ్యాన్స్ మాత్రం చెప్పుకోలేని బూతులను కామెంట్ల రూపంలో పెడుతున్నారు. 
 
దేవీశ్రీ ప్రసాద్ గతంలో ఎప్పుడూ లేని విధంగా తీవ్రంగా నిరాశ పరిచాడని ఫ్యాన్స్ చెబుతున్నారు. కొందరు నెటిజన్లు మహేశ్ బాబు థమన్ లేదా మణిశర్మ సంగీతంలో సినిమా చేయాలని కోరుకుంటున్నామని చెబుతున్నారు. పాటకు వ్యూస్ బాగానే ఉన్నా సింగర్ల ఎంపిక బాగానే ఉన్నా పాట మాత్రం ఆకట్టుకోలేదని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పాట ఇప్పుడు నచ్చకపోయినా సినిమాలో నచ్చే అవకాశం ఉందని కొందరు అభిమానులు చెబుతున్నారు. సరిలేరు నీకెవ్వరు సినిమా నుండి విడుదలయ్యే మిగతా పాటలైనా ఆకట్టుకుంటాయో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: