తెలుగు సినిమా స్థాయిని బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాడు దర్శకధీరుడు రాజమౌళి. తన తదుపరి చిత్రం rrr లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా చేస్తున్న  విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జతగా ఫారెన్ నటి ఒలీవియా మోరిస్, రామ్ చరణ్ కి జతగా బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ లు నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 70 శాతం వరకు అయిపోయిందని ఈ మధ్యనే సినిమా టీం ప్రకటించింది.

 

అలియా భట్ కేవలం పదిహేను రోజులు మాత్రమే షూటింగ్లో పాల్గొన్నదని తన పాత్ర కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటుందని ఆమె షూటింగ్ పార్ట్ ఇప్పటికే అయిపోయిందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో  ఈ సినిమా గురించి ఒక వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అది ఏంటంటే రామ్ చరణ్ కు హీరోయిన్ తో కలిసి ఎక్కువగా సీన్లు లేవని, కేవలం బాలీవుడ్ ప్రేక్షకుల కోసం అలియా భట్ ని తీసుకున్నారని అలాగే రామ్ చరణ్ తో పోలిస్తే ఎన్టీఆర్ కి రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయని ఒక ప్రచారం జరుగుతుంది. 

 

రాజమౌళి అంటేనే ఏ నిమిషానికి ఏ సీను పడితే ప్రేక్షకుడు సినిమాకి ఎంగేజ్ అవుతాడు అనే విషయంలో మాస్టర్ డిగ్రీ తీసుకున్నాడు. అటువంటిది టాలీవుడ్ టాప్ హీరోలైన ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లను కలిపి చేసే సినిమా అంటే తన కసరత్తు ఎలా ఉంటుందో ఊహించు కోవచ్చు. సినిమాకి ఏది అవసరమో ఏది అనవసరమో తనకి తెలిసినంతగా మరొకరికి తెలియదు అని అనుకోవడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఏ హీరోని ఎంతగా వాడాలో అంతగానే వాడుతూ తనకి కావలసిన సినిమా ని  తీయడంలో రాజమౌళి దిట్ట. ఇద్దరు హీరోల అభిమానులను దృష్టిలో పెట్టుకొని వారి వారి సీన్లు పండేలా రాసుకొని ఉంటారని అందరికీ తెలుసు. ఆ హీరో ఎక్కువ  ఈ హీరో ఎక్కువ అనుకునే అవకాశమే రాజమౌళి ఇవ్వడు. కాబట్టి పుల్లలు పెట్టడం మానేసి తెలుగు సినిమాని మరోసారి అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టే ప్రయత్నం మనం కూడా మన వంతు చేద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: