విక్టరీ వెంకటేష్, నాగ చైతన్యలు కలిసి నటిస్తున్న చిత్రం వెంకీ మామా.  బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల  13వ తేదిన విడుదలకి సిద్ధం  అవుతోంది. ఇప్పటి వరకు ఈ సినిమా రిలీజ్ విషయంలో ఎన్నో మార్పులు చేసి చివరికి డిసెంబర్ 13 వ తేదీకి ఫిక్సయ్యారు. ఈ మేరకు నిన్ననే ప్రకటన ఇచ్చింది చిత్ర బృందం. అయితే సినిమా రిలీజ్ ఇంకా పది రోజులుండగా రిలీజ్ డేట్ వెల్లడించడం వెనక ఏమి జరిగిందనేది ఆసక్తిగా మారింది.

 

అయితే ఇదంతా దిల్ రాజు గారి చొరవ వల్లే జరిగిందనే టాక్ వినిపిస్తోంది. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమా "ఇద్దరి లోకం ఒకటే" కోసమే ఇలా చేశాడని అంటున్నారు. రాజ్ తరుణ్ హీరోగా, అర్జున్ రెడ్డి భామ షాలినీ పాండే హీరోయిన్ గా తెరకెక్కిన ఈ చిత్రం సెన్సార్ ని కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా నుండి ఇప్పటికే లిరికల్ సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. కానీ జనాల్లో ఈ సినిమా పట్ల ఎలాంటి బజ్ లేదు.

 

అందువల్ల ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు సరైన డేట్స్ కోసం చూస్తున్నాడట. సినిమాకి బజ్ ఏర్పడట్లేదు కాబట్టి బాక్సాఫీసు డల్ గా ఉన్న టైమ్ లో రిలీజ్ చేయాలని భావించారట. అందువల్ల ఈ సినిమాని క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయాలని అనుకున్నారట. కానీ క్రిస్మస్ కి వెంకీ మామా రిలీజ్ కూడా ఉండడంతో సురేష్ బాబుని ఒప్పించి ఈ తేదీని 13 కి మార్చాడట. సురేష్ బాబు సినిమాకి థియేటర్ల గురించి సమస్య ఉండదు కాబట్టి అలా ఫిక్స్ అయ్యుంటాడని అనుకుంటున్నారు.

 

ప్రస్తుతం డల్ గా ఉన్న బాక్సాఫీసుని వెంకీమామా షేక్ చేస్తాడా లేదా చూడాలి. అలాగే దిల్ రాజు సినిమా ఇద్దరి లోకం ఒకటే అనుకున్నట్లుగా విజయం సాధిస్తుందా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: