ప్రస్తుతం ఇండస్ట్రీలో మెగా కాంపౌండ్ హీరోలలో వరుస విజయాలతో అన్ని రకాల సబ్జెక్టు కలిగిన సినిమాలు చేస్తూ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర వరుస విజయాలు నమోదు చేసుకుంటున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఫిదా, తొలి ప్రేమ, ఎఫ్ 2, గద్దలకొండ గణేష్ లాంటి సూపర్ హిట్స్ సినిమాలు చేసి కమర్షియల్ గా సక్సెస్ అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇటువంటి నేపథ్యంలో బాబాయ్ పవన్ కళ్యాణ్ గతంలో నటించిన సినిమా స్టోరీ బెస్ తో వరుణ్ తేజ్ మూవీ కిరణ్ కొరపాటి దర్శకత్వంలో ప్రస్తుతం చేయబోతున్న సినిమా ఉంటున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినపడుతున్నాయి. విషయంలోకి వెళితే గతంలో పవన్ కళ్యాణ్ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి తమ్ముడిగా అడుగుపెట్టి వరుస విజయాలు నమోదు చేసుకుని 'ఖుషి' తో అద్భుతమైన బ్లాక్ బస్టర్ హిట్ సినిమా అందుకని చిరంజీవి స్థాయికి అప్పట్లోనే ఎదిగి పోవడం జరిగింది.

 

అటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ సొంతంగా డైరెక్టర్ గా మారి జానీ అనే సినిమాని తెరకెక్కించడం జరిగింది. బాక్సింగ్ నేపథ్యంలో కరాటి టైప్ మార్షల్ ఆర్ట్స్ కథతో కూడిన సినిమా పవన్ కళ్యాణ్ అప్పట్లో చేయడం జరిగింది. అయితే ఆ సినిమా పెద్దగా ప్రేక్షకులను అలరించలేకపోయింది. అయితే ఇటువంటి నేపథ్యంలో తాజాగా అటువంటి కథాంశం కలిగిన సినిమానే వరుణ్ తేజ్ ప్రస్తుతం దర్శకుడు కిరణ్ కొరపాటి దర్శకత్వంలో చేస్తున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినపడుతున్నాయి.

 

దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో వరుణ్ తేజ్ చేస్తున్న ఎక్స్పరిమెంట్ వర్క్ అవుట్ అయితే సినిమా హిట్ అయితే అదిరిపోయే రెస్పాన్స్ వస్తుందని మెగా అభిమానులు అంటున్నారు. అయితే అప్పట్లో జానీ సినిమా గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ నిర్మించగా..ప్రస్తుతం వరుణ్ తేజ్ చేయబోతున్న సినిమాని..అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ సేమ్ అదే బ్యానర్ పైన నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: