టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ హాట్ కపుల్ గురించి ఎప్పుడు ఏదో ఒక హాట్ టాపిక్ వైరల్ అవూతూనే ఉంటుంది. అంతేకాదు ఇండస్ట్రీలో ఈ ఇద్దరి ఆదర్శ జీవనం గురించి ఆసక్తిగా మాట్లాడుకుంటారందరు అన్న సంగతి చాలామందికి తెలిసిందే. అయితే ఇటీవల ఆ జోడీ పని ఒత్తిడి నుంచి రిలాక్స్ అయ్యేందుకు ఎంచుకున్న ఓ మార్గం అందరిలోను ఆసక్తికరమైన చర్చకు అవకాశాన్నిచ్చిందట. అసలింతకీ ఈ హాట్ కపుల్ ఎంచుకున్న ఆ కొత్త మార్గం ఏమిటోతెలిస్తే ప్రతీ ఒక్కరు ముక్కుమీద వేలు వేసుకొని షాకవ్వాల్సిందే.

 

అసలు విషయంలో కి వెళితే తమ కష్టం అంతా మర్చిపోయేలా ఈ ఇద్దరు ఎక్కడ రిలాక్స్ అవుతుంటారు.. ఏం చేస్తుంటారు..! అని ఆరా తీస్తే.. ఎవరికీ అందని దూర తీరాలకు వెళ్లిపోయి నచ్చినట్టు జీవితాన్ని ఆస్వాధిస్తున్నారట. అంతేకాదు ఫారిన్ లో కేసినోవాలకు వెళ్లిపోవడమేకాకుండా అక్కడ జూదానికి అలవాటు పడిపోయారట. ఎంతగా అంటే రిలాక్స్ అయ్యేందుకు కచ్ఛితంగా అక్కడికి వెళ్లాల్సిందే అన్నంతగా అడిక్ట్ అయిపోయారన్న గుసగుసలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవడమే కాదు సోషల్ మీడియాలోను వైరల్ అవుతోంది. 

 

ప్రపంచ దేశాల్లో కేసినోలు ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోతున్నారట. అక్కడ నచ్చినట్టు కార్డ్ గేమ్స్ ఆడేస్తూ ఆ ఆటలోనే రిలాక్స్ అవుతుంటారు. అలా గ్యాంబ్లింగ్ లో ఇప్పటికే రాటు దేలిపోయారట. అంతేకాదు ఇటీవలే ఈ ఆటలో జాక్ పాట్ తగిలిందట. అలా వచ్చిన మొత్తాన్ని తిరిగి వేరొక దేశానికి ఎగిరిపోయి అక్కడ కేసినోలు ఆడారట. ఇదంతా చూస్తుంటే ఏదో జేమ్స్ బాండ్ సినిమాలో 007 అతడి గాళ్ ఫ్రెండ్ ఎస్కేప్ వ్యవహారంలా ఉంది అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అంత స్వేచ్ఛగా అల్ట్రా రిచ్ గా ఎంజాయ్ చేయడం బాగానే ఉంది కానీ.. ఎంతో శ్రమిస్తే కానీ డబ్బు సంపాదించలేము. అలా ఆర్జించిన దానిని ఇలా జల్సాలకు తగలేయడం ఎంతవరకూ కరెక్ట్ అన్నది ఆ జంటనే ఆలోచించుకోవాలి మరి. అయితే సరదాగా సంపాదిస్తున్న డబ్బు కాబట్టి ఇష్టమొచ్చినట్టు తగలేస్తున్నారు. నిజంగా శ్రమించి సంపాదిస్తే దాని విలువ తెలుస్తుందని కొందరు ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: