ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అప్పట్లో చిరంజీవి వెంకటేష్ బాలకృష్ణ నాగార్జున హీరోల టైం నడుస్తున్న సందర్భంలో ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్స్ గా రాణించిన ముద్దుగుమ్మలు తాజాగా మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమా లో విజయశాంతి రీ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇదే క్రమంలో అల్లు అర్జున్ నటిస్తున్న 'అలా వైకుంఠపురం లో' సినిమాలో సీనియర్ హీరోయిన్ టబు రీ-ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు రాబోయే సంక్రాంతికి విడుదల కానున్నాయి. ఇదే క్రమంలో అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించిన “జంబలకిడిపంబ “, “మిస్టర్ పెళ్ళాం”, “శుభలగ్నం ” వంటి సినిమాలో నటించిన హీరోయిన్ ఆమని తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి రీ-ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వినబడుతున్నాయి.

 

విషయంలోకి వెళితే అప్పట్లో  అక్కినేని అఖిల్ చిన్ననాటి సమయంలో హీరోయిన్ ఆమని తో “సిసింద్రీ ” సినిమాలో నటించడం జరిగింది. ఆ సినిమాలో అఖిల్ కి అమ్మగా ఆమని నటించిన ఈ విషయం అందరికీ తెలిసినదే. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడం అంతేకాకుండా అటువంటి లేత వయసులోనే నోటినుండి మాటలు కానీ ఈ సమయంలోనే అఖిల్ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. అప్పుడు అఖిల్ వయసు ఒక సంవత్సరం లోపే ఉండడం విశేషం.

 

ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఐటెల్ నటిస్తున్న సినిమాలో ఆమని నటిస్తున్నట్లు అంతేకాకుండా ఈ సినిమాలో అఖిల్ కి తల్లిగా దాదాపు 25 సంవత్సరాల తర్వాత నటిస్తున్నట్లు ఆమని ఇటీవల పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమని మాట్లాడుతూ … టాలీవుడ్ లో తన సెకండ్ ఇన్నింగ్స్ అఖిల్ తోనే ప్రారంభమైందని , 25 సంవత్సరాల తరువాత అఖిల్ కు అమ్మగా నటిస్తున్నానని, ఇప్పుడు జరుగుతున్న మూవీషూటింగ్ లో కూడా అఖిల్ “సిసింద్రీ “ లాగా అనిపిస్తున్నాడని , చాలా క్యూట్ గా ఉన్నాడని అప్పటికీ ఇప్పటికీ పెద్దగా మార్పేమీ లేదని అన్నట్టుగా ఆమని చెప్పుకొచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: