అరుంధతి సినిమా నుండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో అనుష్క కి క్రేజ్ స్టార్ హీరోల కి ధీటుగా వచ్చేసింది. ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా కథ తయారు చేసుకోవాలంటే దర్శక, రచయితలకు అనుష్క నే ఫైనల్ ఛాయిస్. అనుష్క ని మైండ్ లో పెట్టుకొనే కథలు తయారయ్యాయి...అవుతున్నాయి. ఇక కొన్ని కథలు కొందరు స్టార్స్ దగ్గరికి వెళ్లి చివరికి రాసిపెట్టి ఉన్న స్టార్ చేతిలో పడటం ఇండస్ట్రీలో చాలా కామన్ గా జరుగుతూ ఉంటుంది. నిశ్శబ్దం కూడా అలా అనుష్క చేతిలోకి వచ్చి పడింది. 

 

ఇక మన అనుష్క శెట్టి నటించిన సినిమా రిలీజై ఇప్పటికే చాలా కాలం అవుతోంది. ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నప్పటికి..ఇంకా ఆ టైం మాత్రం రావడం లేదు. మరి అనుష్క నటించిన నిశ్శబ్ధం రిలీజ్ ఎప్పుడు..అని అందరికి ఉన్న సందేహానికి తాజాగా క్లారిటీ వచ్చేసింది. నిశ్శబ్ధం సినిమాని జనవరి 31న రిలీజ్ చేయనున్నారట. అయితే ఎప్పటిలానే స్వీటీకి ఈసారి కూడా తీవ్రమైన కాంపిటీషన్ ఎదురవుతోందని ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే తెలుస్తోంది. భాగమతి సినిమాని 2018 జనవరి 26న రిలీజ్ చేశారు. అయితే భాగమతికి పోటీగా రవితేజ సినిమా రిలీజైంది. సాయి తేజ్- నాగ శౌర్య - వరుణ్ తేజ్ లాంటి హీరోలు నటించిన సినిమాలు ఒకదాని వెంట ఒకటిగా రిలీజయ్యాయి. అయితే అన్నిటినీ తట్టుకొని భాగమతి అనుష్క కి మంచి కమర్షియల్ సక్సస్ ను ఇచ్చింది.

 

ఈసారి కూడా నిశ్శబ్ధం కి సేమ్ కాంపిటీషన్ రిపీటవుతోంది. మరోసారి మాస్ మహారాజా రవితేజ అనుష్కకు కాంపిటీషన్ కాబోతున్నాడు. మాస్ రాజా నటించిన 'డిస్కో రాజా' జనవరి చివరిలోనే రిలీజ్ కానుంది. ఈ మాస్ హీరోతో పాటు యంగ్ హీరోలు శర్వానంద్ -విజయ్ దేవరకొండ- నితిన్ నటించిన సినిమాలు రిలీజ్ రెడీ అవుతున్నాయి. అయితే ఈ పోటీని తట్టుకొని అనుష్క సినిమా హిట్ అవుతుందా..లేదా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. మరోసారి భాగమతి మ్యాజిక్ ని రిపీట్ చేస్తుందా చూడాలి. ఇక ఈ సినిమాని కోన వెంకట్- మధు మంతెన కలిసి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా బహుభాషా చిత్రంగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ సినిమాలో అంజలి, శాలిని పాండే కూడా నటిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: