అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల వైకుంఠపురములో సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. 2020 జనవరి 12వ తేదీన అల వైకుంఠపురములో సినిమా విడుదల కాబోతుంది. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. అల వైకుంఠపురములో సినిమా నుండి విడుదలైన సామజవరగమన, రాములో రాములా పాటలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. 
 
ఈ రెండు పాటలు హిట్ అవ్వటంతో అల వైకుంఠపురములో సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ హీరో అల్లు అర్జున్, త్రివిక్రమ్ , నిర్మాతలను తనపై ఒక స్పెషల్ వీడియో సాంగ్ చేయాలని అందుకోసం ఒక స్పెషల్ సెట్ వేయాలని కోరినట్లు తెలుస్తోంది. థమన్ కోరిక విని అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు షాక్ అయినట్లు తెలుస్తోంది. అల వైకుంఠపురములో సినిమాకు ఇప్పటికే 100కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ అయినట్లు తెలుస్తోంది. 
 
రాములో రాములా పాట కోసమే నిర్మాతలు 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ రెమ్యూనరేషన్ లకే 40 కోట్ల రూపాయల వరకు ఖర్చయినట్లు తెలుస్తోంది. మరి ఇలాంటి తరుణంలో థమన్ డిమాండ్ గురించి నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది. ఇప్పటికే అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. 
 
అల వైకుంఠపురములో సినిమాతో హ్యాట్రిక్ విజయాన్ని ఖచ్చితంగా అందుకుంటామని అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆశిస్తున్నారు. అల్లు అర్జున్ కు జోడీగా పూజా హెగ్డే ఈ సినిమాలో నటిస్తోంది. చాలా సంవత్సరాల తరువాత టబు ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తోంది. గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లపై ఈ సినిమా తెరకెక్కుతోంది. అల్లు అర్జున్ కెరీర్లో హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతూ ఉండటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: