టాలీవుడ్ లో మోస్ట్ బ్యటీఫుల్ ఆన్ స్క్రీన్ పెయిర్ అండ్ ఆఫ్ స్క్రీన్ కపుల్ ఎవరంటే ఠక్కున వచ్చే సమాధానం నాగ చైతన్య – సమంత అనే. చూడచక్కని ఈ సినిమా జంట నిజ జీవితంలో కూడా ఒక్కటై క్యూట్ కపుల్ అనిపించుకున్నారు. అలా వీరిద్దరి ఏ ఫొటో బయటకొచ్చినా వైరల్ అవుతూంటాయి. రీసెంట్ గా వీరిద్దరూ ఎయిర్ పోర్టులో ఉండగా ఉన్న స్టిల్స్ బయటకొచ్చాయి. ఎక్కడికి వెళ్తున్నారో అప్పుడు తెలీలేదు కానీ సమంత చేసిన పోస్ట్ తో వాళ్లిద్దరూ ఎక్కడికి వెళ్లారో తెలిసింది.

 

 

నాగ చైతన్య – సమంత వెళ్లింది సింగపూర్ కి అని సమాచారం. అక్కడ జరిగిన చైతూ వాళ్ల అన్నయ్య బర్త్ డే సెలబ్రేషన్స్ కు ఈ జంట హాజరయ్యారట. చైతూకు అన్నయ్యా.. అని ఆశ్చర్యపడకండి. లక్ష్మి దగ్గుబాటి.. నాగార్జున నుంచి విడిపోయాక తమిళ వ్యక్తిని పెళ్లాడిన విషయం తెలిసిందే. వీరి కుమారుడి పుట్టినరోజు సెలబ్రేషన్స్ కే చైతూ-సామ్ సింగపూర్ వెళ్లారు. అక్కడ బర్త్ డే సెలబ్రేషన్స్ లో దిగిన ఫొటోను సమంత తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. దీంతో ఈ వివరాలు బయటకొచ్చాయి. చైతూ – సమంతతో పాటు లక్ష్మీ దగ్గుబాటి దంపతులు, వారి కుమారుడి జంట కూడా ఈ ఫొటోలో ఉన్నారు. దీంతో ఈ ఫొటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

 

 

లక్ష్మీ దగ్గుబాటి దంపతులు అమెరికా నుంచి సింగపూర్ కు వెళ్లారని తెలుస్తోంది. ఇటివలే చైతూ బర్త్ డే సెలబ్రేషన్స్ ను గోవాలో జరుపుకున్న ఈ జంట ఇప్పుడు సింగపూర్ లో ఎంజాయ్ చేస్తున్నారు. అక్కినేని అభిమానులకు కూడా ఈ పిక్ బాగా ఆకట్టుకుంటోంది. చైతూ, సామ్ ప్రస్తుతం వేర్వేరు సినిమాల్లో నటిస్తున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

❤️ #family #lovetheholidays

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

మరింత సమాచారం తెలుసుకోండి: