టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు సూపర్ స్టార్ ఫ్యాన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ మరియు మైండ్ బ్లాక్ సాంగ్ తరువాత సినిమా పైన ఉన్న అంచనాలు మరింతగా పెరిగాయి. సూపర్ స్టార్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కొన్నేళ్ల తరువాత ఈ సినిమా ద్వారా రీఎంట్రీ ఇస్తున్నారు. 

 

దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు రత్నవేలు ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. మహేష్ బాబు, దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా దర్శకుడు తెరకెక్కిస్తున్నట్లు టాక్. ఇక ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని జనవరి 1వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సినిమా యూనిట్ ఏర్పాట్లు చేస్తోందట. 

 

టీజర్ లో హీరోయిన్ రష్మిక మందన్న కనపడకపోవడంతో ఆమె ఫ్యాన్స్ కొంత హర్ట్ అయిన విషయం తెలిసిందే. కాగా ట్రైలర్ లో రష్మికకు సంబందించిన సీన్స్ కూడా ఉండబోతున్నాయట. ఇక ట్రైలర్ లో మంచి యాక్షన్ సీన్స్ తో పాటు కామెడీ సీన్స్ కూడా ఉండనున్నాయట. ఇక ట్రైలర్ రిలీజ్ తరువాత సినిమాపై ప్రేక్షకులు పూర్తిగా ఒక అభిప్రాయానికి వస్తారని, అలానే తప్పకుండా వారందరి అంచనాలు అందుకునేలా సినిమా ఉంటుందని యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే వరుసగా రెండు భారీ హిట్స్ సొంతం చేసుకున్న మహేష్ బాబు, ఈ సినిమాతో మరొక హిట్ ని తన ఖాతాలో వేసుకుని హ్యాట్రిక్ విజయాలు అందుకోవాలని చూస్తున్నారు......!! 

మరింత సమాచారం తెలుసుకోండి: