పూరిజ‌గ‌న్నాథ్‌, విజ‌య్ దేవ‌ర కొండ ఒక క్రేజీ డైరెక్ట‌ర్‌తో క్రేజీ హీరో వీరిద్ద‌రి కాంబోలో ఓ చిత్రం రాబోతున్న విష‌యం తెలిసిందే. ఇస్మార్ట్ శంక‌ర్ త‌ర్వాత పూరి విజ‌య్‌తో సినిమా తీయ‌నున్నారు. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాని, పూరి పాన్ ఇండియా లెవల్లో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా స్టోరీ కూడా యూనివర్సల్ గా వర్కౌట్ అయ్యే విధంగా ఉందని.. ఇతర భాషల ప్రేక్షుకులకు కూడా స్క్రిప్ట్ బాగా కనెక్ట్ అవుతుందని పూరి ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం పూరి టీమ్ బాలీవుడ్ అండ్ కోలీవుడ్ లకు సంబంధించిన కొంతమంది నిర్మాతలతో ఈ ప్రాజెక్ట్ భాగస్వామ్యం గురించి చర్చిస్తున్నారట.

కాగా ఈ సినిమాలో కియారా అద్వానీ విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరూ ఓ యాడ్ ఫిల్మ్ లో కలిసి నటించారు. ఈ సినిమా కూడా పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌ పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నారు. 

అర్జున్ రెడ్డితో ఇండస్ట్రీ మొత్తాన్ని ఒక ఊపు ఊపిన ఈ కుర్ర హీరో…ఆ తర్వాత గీత గోవిందంతో తన ఫ్యాన్ బేస్ ని మరింత స్ట్రాంగ్ చేసుకున్నాడు..కట్ చేస్తే…సంపాదించింది అంతా….రాత్రి ఆడిన పేకాటలో పోయినట్లు పాపం…డియర్ కామ్రెడ్ సినిమాతో మొత్తం క్రేజ్ ను కోల్పోయాడు విజయ్…

ఇప్పుడు విజయ్ పరిస్థితి ఎలా ఉంది అంటే…విజయ్ తో వరుస సినిమాలు చెయ్యాలి అని ప్లాన్ చేసుకున్న మైత్రీ మూవీస్ సంస్థ వాళ్ళు…తనతో సినిమా చేస్తే….నష్టపోతాం అన్న ఆలోచనకు వచ్చేశారు అని అర్ధం చేసుకోవచ్చు…అంతేకాదు.. ఒక సినిమాను అయితే ఏకంగా ఆ సంస్థ మొదలు పెట్టి…కొన్ని రోజులు షూటింగ్ చేసి మరీ ఆపెయ్యడం నిజంగా విజయ్ మార్కెట్ పరిస్థితికి అద్దం పడుతుంది. మ‌రి ఈ చిత్రంతో పూరి తిరిగి విజ‌య్ క్రేజ్‌ని పైకి తీసుకొస్తారా లేదా అన్న‌ది వేచి చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: