‘స్వాతి కిరణం’ ‘దళపతి’ సినిమాల నుండి ఈ ఏడాది వచ్చిన ‘యాత్ర’ మూవీ వరకు మమ్ముట్టి తన అసాధారణ నటనతో గంభీరంతో నిండిన గొంతుతో తానూ నటించిన ఎన్నో పాత్రలకు జీవంపోసి తెలుగు ప్రేకషకుల హృదయాలలో సుస్థిర స్థానం ఎర్పరుచుకున్నాడు. యాత్ర మూవీలో తన పాత్రకు తనగొంతే వినిపించాలని పట్టుపట్టి తెలుగు నేర్చుకున్న  ఈ టాప్ హీరో పట్టుదల చూసి ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోయాయి. 

‘బాహుబలి’ ఇచ్చిన స్పూర్తితో అన్ని భాషల ఇండస్ట్రీలలో చారిత్రాత్మక నేపథ్యమున్న చిత్రాలు భారీ బడ్జెట్ సినిమాలు తీస్తూ తాము కూడ ‘బాహుబలి’ స్థాయి సినిమాలను తీయగలమని సంకేతాలు ఇస్తున్నాయి. లేటెస్ట్ గా మాలీవుడ్‌ లో ఒక ప్రతిష్టాత్మక చిత్రం రూపొందుతోంది. 

చరిత్ర విస్మరించిన ఒక యోధుడి కథతో ‘మామంగం’ అనే చిత్రం రాబోతోంది. ఈ సినిమాలో మమ్ముట్టి ప్రధాన పాత్రను చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగులో అరవింద్ తన గీత ఫిలిమ్స్ ద్వారా విడుదల చేస్తున్నాడు.  ఈ మూవీని ప్రమోట్ చేస్తూ హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఒక మీడియా మీట్ లో అరవింద్ మమ్ముట్టికి ఉన్న విపరీతమైన కోపం గురించి ఒక ఆసక్తికర విషయం వెల్లడించి అందరికీ షాక్ ఇచ్చాడు. 

తాను పదేళ్ల క్రితం పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ పాత్రను చేయమని మమ్ముట్టికి ఫోన్ చేసిన విషయాన్ని బయట పెట్టాడు. ‘పవన్ సినిమాలో ఒక పవర్ ఫుల్ విలన్ క్యారెక్టర్ మీరు చేస్తే బాగుంటుంది ఏమంటారు’ అని అరవింద్ అడిగాడట. దీనితో తీవ్ర అసహనానికి గురైన మమ్ముట్టి ‘చిరంజీవిని ఇదే మాట అడగగలరా’ అంటూ ప్రశ్నించి కనీసం అరవింద్ సమాధానం చెప్పేలోగా ఫోన్ లైన్ కట్ చేసాడట. దీనితో ఆ రోజు నుంచి మమ్ముట్టితో తాను చాల జాగ్రత్తగా ఉంటున్నాను అంటూ అప్పటి విషయాలను ఇప్పుడు బయటపెట్టి అరవింద్ చెపుతున్నప్పుడు మముట్టి కూడ నవ్వుకోవడం ఆ ఫంక్షన్ లో హైలెట్ గా మారింది..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: