దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో ఏదైనా సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో అంచనాలు పెరగడం కామన్ . కానీ  ఇప్పుడు వచ్చే సినిమాపై మాత్రం టాలీవుడ్ ప్రేక్షకుల్లోనే  కాదు వరల్డ్ వైడ్గా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.  బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి సినిమా అంటే ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు పెట్టుకొని ఆసక్తిగా ఎదురు చూసే ప్రేక్షకులు ఎంతో మంది ఉన్నారు. అయితే ప్రస్తుతం బాహుబలి లాంటి తర్వాత  రాజమౌళి ఆర్ఆర్ఆర్ అనే సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో టాలీవుడ్ టాప్ హీరోలైన   రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లు  నటిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై మరింత హైప్  పెరిగిపోయింది. సినిమా ఎప్పుడెప్పుడు రాబోతుందని వేయికళ్ళతో ఎదురు చూస్తున్నారు అభిమానులు. 

 

 

 

 కాగా ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలు రామ్ చరణ్  సరసన ఆలియాభట్ నటిస్తుండగా... జూనియర్ ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ఓవిలియ మోరిస్  నటిస్తోంది. అయితే ఈ చిత్ర షూటింగ్ తొందరగా పూర్తి చేసి కేవలం ప్రొడక్షన్ పనులు  కోసం ఆరు నెలల సమయం తీసుకోవాలని అనుకుంటున్నాడట దర్శకధీరుడు రాజమౌళి. రాజమౌళి సినిమా అంటే అందులో హీరో పాత్రలు  ఎంత పవర్ ఫుల్ గా ఉంటాయో తెలిసిందే . ఇక ప్రస్తుతం పవర్ఫుల్ హీరోలు నటిస్తుండడంతో ఆ పాత్రలు  ఇంకా ఫుల్ గా ఉండనున్నాయి. అయితే ఈ మధ్య మీడియాతో మాట్లాడిన దర్శక ధీరుడు రాజమౌళి తన సినిమాలో అలియా భట్ పాత్ర  పదిహేను నిమిషాలే ఉన్నప్పటికీ ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకుందని రాజమౌళి చెప్పుకొచ్చారు. దీంతో రామ్ చరణ్ కు ఆలియా భట్ కి  ఎలాంటి రొమాంటిక్ సీన్స్ ఉండే అవకాశం లేనట్లు తెలుస్తుంది. 

 

 

 కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తన హీరోయిన్ తో మంచి రొమాన్స్ ఉండబోతున్నట్లు  సమాచారం. చిత్ర బృందం జూనియర్ ఎన్టీఆర్కు జోడీగా ఓవిలియ  మోరీస్  ఈ మద్యే  తీసుకున్న విషయం తెలిసిందే. కాగా  ప్రస్తుతం వీరిద్దరి సన్నివేశాల చిత్రీకరణ జరగాల్సి ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వీరిద్దరి చిత్రీకరణ జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రాన్ని జూలై 20న విడుదల చేయాలనుకున్న రాజమౌళి ఇప్పుడు గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. మొత్తంగా ఈ సినిమాని పది భాషల్లో విడుదల చేయాలనుకుంటున్నారట జక్కన . అయితే ఈ సినిమాలు మొత్తానికి రామ్ చరణ్ ను  రొమాన్స్ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ దాడి చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: