ఒకప్పుడు దేవిశ్రీప్రసాద్ ట్యూన్ చేసిన పాటలు విని పూనకంతో ఊగిపోయే యూత్ ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ ను కొంతకాలం విరామం తీసుకోమని సోషల్ మీడియాలో పెడుతున్న కామెంట్స్ దేవిశ్రీ మైండ్ ను బ్లాంక్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొన్న విడుదలైన ‘సైరిలేరు నీకెవ్వరు’ మూవీ మొదటి పాట ‘మైండ్ బ్లాంక్’ పై పైకిచెప్పక పోయినా మహేష్ అభిమానులు కూడ పెదవి విరుస్తున్నట్లు టాక్. 

‘రంగస్థలం’ మూవీ తరువాత దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్ చేసిన ఏపాటకు దేవిశ్రీ మంచి ట్యూన్ ను ఇవ్వలేకపోయాడు. ఈసంవత్సరం విడుదలైన ‘వినయ విధేయ రామ’ ‘మహర్షి’ సినిమాలలో దేవిశ్రీ సంగీతానికి ఏవరేజ్ మార్కులు మాత్రమే పడ్డాయి. 

ఈసంగీత దర్శకుడు మైండ్ లో క్రియేటివిటీ పూర్తిగా తగ్గిపోయింది అంటూ ప్రచారం మొదలు కావడంతో ‘సరిలేరు నీకెవ్వరు’ విషయంలో దేవిశ్రీ ప్రసాద్ విపరీతమైన ఒత్తిడికి లోనయ్యాడు. ఆ ప్రభావం మొన్న విడుదలైన మైండ్ బ్లాంక్ ట్యూన్ ను బట్టి అర్ధం అవుతుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. దీనితో ‘సరిలేరు నీకెవ్వరు’ కు సంబంధించి మిగతా పాటలను విడుదల చేయడానికి కూడ ఈమూవీ మేకర్స్ భయపడిపోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 


ఈమధ్య తమన్ ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ తనకు విపరీతమైన పని ఒత్తిడి పెరిగిపోతోందని దీనితో తన మైండ్ ను ఫ్రెష్ చేసుకోవడానికి ఒక రెండు నెలల పాటు విరామం తీసుకోవాలని ఉంది అంటూ కామెంట్ చేసాడు. ప్రస్తుతం పీక్ లో కొనసాగుతున్న తమన్ రెస్ట్ తీసుకునే ఆలోచన చేస్తున్న పరిస్థితులలో అదే పద్ధతి దేవిశ్రీ కూడ అనుసరిస్తే మంచిది కూడ అంటూ వస్తున్న సూచనలు చూసి దేవిశ్రీ తీవ్ర అసహనానికి లోనవుతున్నట్లు టాక్. ప్రస్తుతం దేవిశ్రీ పై ఈ నెగిటివ్ దాడి కొనసాగుతున్నా అతడిని సుకుమార్ బన్నీతో తీయబోతున్న మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపిక చేసిన నేపధ్యంలో దేవిశ్రీ ప్రస్తుత పరిస్థితి చూసి సుకుమార్ కూడ ఖంగారు పడిపోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: