రాజ్ తరుణ్ హీరోగా, హెబ్బా పటేల్ హీరోయిన్లుగా దర్శకుడు సుకుమార్ నిర్మాతగా వ్యవహరించిన చిత్రం కుమారి 21 ఎఫ్. ఈ సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసే ఉంటుంది. సుకుమార్ అందించిన కథతో సుకుమార్ నిర్మాణంలో వచ్చిన సినిమా అది. ఈ సినిమా ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాకు దర్శకత్వం వహించింది సూర్య ప్రతాప్ ఎవరికీ పెద్దగా తెలియదు.
ఎందుకంటే సినిమా మొత్తం సుకుమార్ పేరుతో నడిచింది కాబట్టి డైరెక్టర్ ఎవరనేది తెలియలేదు. అయితే సూర్యప్రతాప్ సుకుమార్ కి ప్రియ శిష్యుడు. కుమారి 21 ఎఫ్ తర్వాత సూర్య ప్రతాప్ మరో సినిమా చేయలేదు. ఆ సినిమా మంచి విజయం సాధించినప్పటికీ మరో సినిమా చేయకపోవడం విడ్డూరమే. అయితే మళ్ళీ సూర్య ప్రతాప్ కోసం సుకుమార్ కలం పట్టాడు. సుకుమార్ అందించిన కథతో సూర్య ప్రతాప్ తర్వాతి చిత్రం ప్రారంభం కాబోతుంది.
సుకుమారే కథ, స్క్రీన్ ప్లే రాసి.. మరోసారి నిర్మాతగా మారి ప్రతాప్ సినిమాను పట్టాలెక్కిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్తో కలిసి సుక్కు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ముందు నితిన్తో ఈ సినిమా చేయాలని అనుకున్నారు. కానీ వర్కవుట్ కాలేదు. ఈ సినిమాలో యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్నాడు అర్జున్ సురవరం సినిమా బయటకి రావడానికి సాయపడిన అరవింద్ గారి కోసం నిఖిల్ ఈ సినిమా చేస్తున్నట్లు అర్థం అవుతుంది.
క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకులకి చాలా ఆసక్తి ఉంది. సుకుమార్ కథ అందిస్తున్నాడంటే ఏదో కొత్త అంశం ఉండి ఉంటుంది. మరి ఆ కొత్త అంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా దర్శకుడికి పేరు తీసుకువస్తుందా సుకుమార్ కి పేరు తీసుకువస్తుందా చూడాలి.మరి కొద్ది రోజుల్లో ఈ సినిమా చిత్రీకరణకి వెళ్లనుంది.