బాలకృష్ణ ‘రూలర్’ సాయి ధరమ్ తేజ్ ‘ప్రతిరోజు పండగే’ మూవీలు ఈ నెల 20న విడుదల కాబోతున్నట్లు చాల ముందుగానే ప్రకటించాయి. అయితే వీరికన్నా ముందుగా ఇప్పుడు ‘వెంకీ మామ’ ఈనెల 13న రాబోతున్నాడు. 

ఈ మూవీని తెలుగు రాష్ట్రాలలో అత్యధిక ధియేటర్లలో విడుదల చేసి భారీ ఓపెనింగ్స్ రాబట్టాలని ఈ మూవీ నిర్మాతలు భారీ ప్లాన్స్ లో ఉన్నారు. అనుకున్న విధంగా ‘వెంకీ మామ’ కు పాజిటివ్ టాక్ వస్తే ఆ తరువాత కేవలం వారం రోజుల గ్యాప్ లో వచ్చే బాలయ్య సాయి తేజ్ ల సినిమాలకు సరైన ధియేటర్లు కూడ దొరకవు అన్న ప్రచారం జరుగుతోంది. 

దీనికితోడు సల్మాన్ ఖాన్ ‘దబాంగ్ 3’ గండం ఇప్పటికే బాలయ్య తేజ్ లను వెంటాడుతోంది. ఇప్పుడు ‘వెంకీ మామ’ మూవీ రిలీజ్ కు ఇక కేవలం 11 రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో ఈ సినిమాను చాల అగ్రెసివ్‌ గా ప్రమోట్ చేసి జనంలోకి తీసుకు వెళ్ళే వ్యూహాలు సురేశ్ బాబు రచిస్తున్నట్లు టాక్. రామానాయుడు కలలు కన్న వెంకీ-చైతూల కాంబినేషన్ మూవీ కావడంతో ఈ మూవీ ప్రమోషన్ కు సురేశ్ బాబు చాల భారీగా ఖర్చు పెట్టబోతున్నట్లు సమాచారం. 

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లను వరసపెట్టి విడుదల చేస్తున్న ఈమూవీ యూనిట్ ఈమూవీకి సంబంధించిన ప్రి రిలీజ్ ఈవెంట్ కూడా చాలా గ్రాండ్‌ గా చేయబోతున్నారని వార్తలు ఉన్నాయి. గత కొన్నేళ్లగా తన బ్యానర్ లోవచ్చిన ఏ మూవీకి ఖర్చు పెట్టని స్థాయిలో సురేశ్ బాబు పత్రికల్లో టీవీల్లో పెద్ద ఎత్తున ప్రకటనలతో పాటు అనేక నగరాల్లో మామ అల్లుళ్ళను కలిపి భారీ ఫ్లెక్సీలు హోర్డింగ్ లతో హోరెత్తించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ ఇప్పటికే వెంకటేష్ ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలు పెట్టేసాడు. త్వరలోనే ఈ మామ అల్లుళ్ళ హంగామాతో బుల్లితెర హోరెత్తబోతోంది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: