వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. వర్మ దర్శకత్వం వహిస్తున్న అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా సెన్సార్ సమస్యల్లో చిక్కుకుంది. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ప్రముఖుల జీవితాల్లోని వివాదాస్పద అంశాలపై సినిమాలు తీస్తూ వార్తల్లో నిలుస్తున్న వర్మపై బయోపిక్ తెరకెక్కుతోంది. 
 
పాటల రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు పప్పువర్మ అనే టైటిల్ తో సినిమా పనులు ప్రారంభించారని తెలుస్తోంది. బీహార్ నుండి వర్మను పోలిన వ్యక్తిని తీసుకొనివచ్చి ఈ సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. వర్మ మేనరిజంలను జొన్నవిత్తుల ప్రస్తుతం ప్రాక్టీస్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వర్మ మెగాస్టార్ తో సినిమా తీస్తానని ప్రకటించగా జొన్నవిత్తుల రామ్ గోపాల్ వర్మపై ఫైర్ అయ్యారు. 
 
వర్మ మూలంగా జొన్నవిత్తుల నిర్మాతగా అవతారం ఎత్తి సినిమా తీస్తున్నాడు. ప్రముఖుల బయోపిక్ లు తీసే రామ్ గోపాల్ వర్మపై బయోపిక్ తీయబోతున్నాడు జొన్నవిత్తుల. ఈ సినిమాకు దర్శకత్వం ఎవరు వహిస్తారో తెలియాల్సి ఉంది. జొన్నవిత్తుల గతంలో వర్మ తన కెరీర్ ను తనే నాశనం చేసుకున్నాడని, వర్మ ఒక పప్పు అని అంతర్జాతీయంగా వర్మ కంటే మరొక పప్పు ఎవరూ ఉండరని విమర్శలు చేశారు. 
 
జొన్నవిత్తుల రామ్ గోపాల్ వర్మ ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవడం మానుకోవాలని తన కెరీర్ ను వర్మ బాగు చేసుకోవాలని పేర్కొన్నాడు. జొన్నవిత్తుల నిర్మాతగా వ్యవహరిస్తున్న పప్పువర్మ నిర్మాతగా జొన్నవిత్తులకు లాభాలను ఇస్తుందో లేదో చూడాలి. ప్రముఖుల జీవితాల్లోని వివాదాస్పద అంశాలపై సినిమాలు తీసే వర్మపై జొన్నవిత్తుల ఎలాంటి సినిమాను నిర్మించబోతున్నాడో చూడాల్సి ఉంది. తనపై తెరకెక్కబోయే పప్పువర్మ సినిమాను కూడా వర్మ తన పబ్లిసిటీకి ఎలా వాడుకుంటాడో చూడాలి. అందరికీ తన సినిమాలతో షాక్ ఇచ్చే రామ్ గోపాల్ వర్మ కు జొన్నవిత్తుల పప్పువర్మ సినిమా నిర్మాణం ప్రారంభించి షాక్ ఇచ్చాడని చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: