ప్రస్తుతం తెలుగు టెలివిజన్ రంగంలో మంచి పేరుతో దూసుకెళ్తున్న జబర్దస్త్ షో నుండి జడ్జీగా వ్యవహరిస్తున్న నాగబాబు ఇటీవల అర్ధాంతరంగా బయటకు రావడం జరిగింది. తనకు ఆ షో నిర్వాహక సంస్థైన మల్లెమాల టీమ్ లో కొందరు సభ్యుల ప్రవర్తన నచ్చకనే తాను బయటకు రావడం జరిగిందని, మొన్న ఒక వీడియో బైట్ లో నాగబాబు తెల్పడం జరిగింది. ఇక నాగబాబుతో పాటు ఆ షో నుండి అనసూయ మరియు చమ్మక్ చంద్ర బయటకు రానున్నారు. అయితే వారి వెంట ముఖ్యమైన పార్టిసిపెంట్స్ కొందరు కూడా బయటకు రావాలని భావించడంతో, మల్లెమాల టీమ్ అలర్ట్ అయి, 

 

మరొక జడ్జి అయిన రోజాను రంగంలోకి దింపి సయోధ్య కుదిర్చి, మొత్తానికి వాళ్ళను బయటకు వెళ్లకుండా ఆపారు. కాగా నిన్న ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో రోజా గురించి కొన్ని సంచలన నిజాలు నాగబాబు బయటపెట్టారు. ముందుగా కొన్నేళ్ల క్రితం తాను మల్లెమాల వారి అదుర్స్ అనే కార్యక్రమంలో పాల్గొంటుండగా, మరికొద్దిరోజుల్లో మా సంస్థ నుండి జబర్దస్త్ అనే ప్రోగ్రాం ని ప్రారంభించాలి అనుకుంటున్నాము, 25 వారాలు సాగె ఆ షోలో మీ రాజకీయ ప్రత్యర్థి అయిన రోజా గారు మీతో పాటు జడ్జీగా పాల్గొంటారు, కాబట్టి ఈ విషయమై మీ నిర్ణయం కొంత అలోచించి చెప్పండి అని కోరారట. 

 

అయితే తాను కొంత ఆలోచన చేసిన తరువాత, మా ఇద్దరి మధ్య రాజకీయంగా విబేధాలు ఉన్నప్పటికీ, నటులుగా మేము ఎప్పుడూ ఒక్కటే అనే భావనతో ఆమెతో జబర్దస్త్ లో కలిసి పని చేసానని, అలా చూస్తూ ఉండగానే షో దిగ్విజయంగా ఏడేళ్లు పూర్తి చేసుకుందని అన్నారు. ఇక రోజా గారు చాలా కలుపుగోలు మనిషని, తాను ఒక ఎమ్యెల్యే అయినప్పటికీ, షోలో ప్రవేశించగానే అందరితో ఎంతో కలిసిపోయి మాట్లాడుతారని నాగబాబు అన్నారు. ఇక ఈ షో ద్వారా తనకు రోజా గారు మంచి ఫ్రెండ్ అయ్యారని, ఆవిడతో జబర్దస్త్ లో గడిచిన రోజులు ఎప్పటికీ మరిచిపోలేనని నాగబాబు అన్నారు......!! 

మరింత సమాచారం తెలుసుకోండి: