దిశ అత్యాచారం హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై దేశం మొత్తం భగ్గుమంటుంది. ఎట్టిపరిస్థితుల్లో నిందితులను కఠినంగా శిక్షించాలి అంటూ డిమాండ్  చేస్తున్నారు దేశ ప్రజానీకం. మరోసారి ఆడపిల్లలపై ఇలాంటి వైద్యం జరగకుండా నిందితులకు శిక్షలు పడాలంటు  నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కాగా తాజాగా దీనిపై స్పందించిన జబర్దస్త్ యాంకర్ అనసూయ దిశా  ఘటనాపై ఘాటు  వ్యాఖ్యలు చేసింది. అయితే దిశగా ఘటనలో నిందితులకు సపోర్ట్ చేస్తూ కొంతమంది జుగుప్సాకరమైన అసభ్య కామెంట్లు చేశారు. అయితే ఈ కామెంట్ లను  స్క్రీన్ షాట్ తీసి చూపిస్తూ అనసూయ భావోద్వేగానికి గురైంది. దిశా ఘటనపై వస్తున్న జుగుప్సాకరమైన కామెంట్లు చూసే ఘాటు వ్యాఖ్యలు చేసింది. 

 

 

 

ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో చెప్పడానికి మీరెవరు... ఎలాంటి బట్టలు వేసుకునేది చెప్పటానికి మీరెవ్వరు  అంటూ ప్రశ్నించింది.మన జాగ్రత్తలో మేముంటే అయిన  ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ముందు మీ  బిడ్డలను మీరు సరిగ్గా పెంచండి. మరో ఆడపిల్లల్ని కూడా నీ కూతురు ల  చూస్తూ కామపు  ఆలోచనలు ముందు నువ్వు మానేయ్. నేను మాట్లాడుతుంటే ఎవడో  ఏందే నీ గోల  అంటున్నారు వాడి ముందు నేను అంటే మాటలు కాదు ఉచ్చ పోయిస్తా . కంప్యూటర్ ముందు నుండి  మాటలు చెప్పడం కాదు మగతనం అంటే అంటు  ఘాటుగా స్పందించింది అనసూయ. దిశా ఘటన  నన్ను చాలా ఆవేదనకు గురి చేసింది. అది ఆవేదన కోపమా ప్రేమ అనేది నాకు అర్థం కాలేదు. 

 

 

 

 గతంలో మహిళలపై చాలా ఘోరాలు హత్యలు జరిగాయి అప్పుడు ఏం పీకారు ఢిల్లీలో నిర్భయ ఘటన నిందితులకు ఉరిశిక్ష పడింది ఇప్పటికైనా అమలయ్యేలా చేసారా అంటూ  ప్రశ్నించింది అనసూయ. దిశా ఘటన తర్వాత  తర్వాత నాకు చాలా భయం కలుగుతుంది. నాకు పరిచయం ఉన్న మగాళ్లంటే కూడా ఎంత భయం ఏర్పడుతుంది. వొళ్ళంతా  తో కళ్ళు పెట్టుకొని బ్రతకాల అంటూ అనిపిస్తుంది అంటూ అనసూయ చెప్పుచ్చింది . ఎవరికి నచ్చింది వాడు  మాట్లాడుతున్నాడు మహిళలు జాగ్రత్తగా ఉండాలి. అలా ఉండాలి ఇలా ఉండాలి అని. జాగ్రత్తగానే ఉంటున్నాం కానీ ప్లాన్ చేసి చంపేస్తున్నారు. మా పని మేం చేసుకోకుండా ఎవరు ఎటువైపు నుంచి మమ్మల్ని చూస్తున్నారు అంటూ గమనించుకుంటూ కూర్చోవాలా అంటూ అనసూయ ప్రశ్నించింది. ముందు మనలో మార్పు రావాలి ఆడవాళ్లను ఎలా గౌరవించాలో ఇంట్లో వాళ్లకు నేర్పించాలి అంటూ ఎమోషనల్ అయింది జబర్దస్త్ అనసూయ.

మరింత సమాచారం తెలుసుకోండి: