ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి పుణ్యమా అంటూ ప్రభాస్ కి ఇంటర్నేషనల్ మార్కెట్ ఏర్పడింది. బాహుబలి సినిమా తో దేశవ్యాప్తంగా తోపాటు అంతర్జాతీయంగా పాపులర్ హీరో అయ్యాడు ప్రభాస్. అదేంటి అదేస్థాయిలో సినిమా హిట్ కొట్టాలని 'బాహుబలి' తర్వాత భారీ బడ్జెట్ తో చేసిన సాహో సినిమా తీవ్ర నిరాశ పరిచింది. సౌత్ ఇండస్ట్రీ లో ఉన్న అన్ని ఇండస్ట్రీలలో విడుదలైన సాహో సినిమా దారుణంగా పరాజయం పాలుకావడం జరుగుతుంది. అయితే బాలీవుడ్లో మాత్రం  కళ్ళు చెదిరే విధంగా కలెక్షన్లు సాధించింది. దీంతో చాలామంది బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్ ఫ్లాప్ అయిన సినిమాకి రికార్డు స్థాయిలో కలెక్షన్లు రావడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న బడా బడా నిర్మాతలు డైరెక్టర్లు ప్రభాస్ తో సినిమా చేయడానికి ప్రస్తుతం ఎగబడుతున్నారు.

 

ఇటువంటి తరుణంలో తాజాగా ప్రభాస్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ అదిరిపోయే ప్రాజెక్టులో నెగిటివ్ పాత్రలో విలన్ పాత్రలో ప్రభాస్ చేత చేయించడానికి బాలీవుడ్ స్టార్ నిర్మాత ఆదిత్య చోప్రా ప్రయత్నాలు చేస్తున్నట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో వినపడుతున్న టాక్. విషయంలోకి వెళితే ఇటీవల బాలీవుడ్ స్టార్ నిర్మాత ఆదిత్య చోప్రా ధూమ్ సీరీస్ లోని నాలుగో భాగంలో ప్రభాస్ ను విలన్ గా తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నది. 

 

దీనికోసం భారీ మొత్తాన్ని చెల్లించేందుకు సిద్ధం అవుతున్నది. ధూమ్ 1లో జాన్ అబ్రహం, ధూమ్ 2లో హృతిక్, ధూమ్ 3లో అమీర్ ఖాన్ లు విలన్ పాత్రల్లో నటించి మెప్పించారు. సినిమా మొత్తం వీరి చుట్టూనే తిరుగుతుంది. త్వరలోనే ధూమ్ 4 సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. మరి ధూమ్ 4 లో ప్రభాస్ విలన్ పాత్రలో చేస్తారో లేదో చూడాలి. కాగా ప్రస్తుతం మాత్రం జిల్ ఫెమ్ డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో పాతకాలం నాటి ప్రేమ కథ సినిమా లో ప్రభాస్ నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: