సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు పై ప్రేక్షకుల్లో రోజురోజుకు అంచనాలు విపరీతంగా పెరుగుతున్నాయి. మొట్టమొదట ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఇంట్రో టీజర్ కు అలానే స్వాతంత్రోద్యమ కానుకగా వీర జవానులను స్మరిస్తూ రిలీజ్ చేసిన మరొక టీజర్ కు మంచి స్పందన లభించింది. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ తరువాత సినిమాపై అంచనాలు మరింతగా పెరిగి తారా స్థాయికి చేరాయి అనే చెప్పాలి. 

 

ఇకపోతే మూడు రోజుల క్రితం ఈ సినిమా నుండి మొదటి లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేసింది సినిమా యూనిట్. మైండ్ బ్లాక్ అనే పల్లవతితో ఈ మాస్ సాంగ్ ని బ్లెజ్ మరియు రనినా రెడ్డి ఆలపించడం జరిగింది. యువ లిరిక్ రైటర్ శ్రీమణి అందించిన లిరిక్స్ ఈ సాంగ్ కి ఎంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు కొన్నేళ్ల తరువాత ఊర మాస్ గెటప్ లో దర్శనం ఇవ్వబోతున్నట్లు ఈ సాంగ్ లిరిక్స్ ని బట్టి చూస్తే అర్ధం అవుతుంది. ఇక యూట్యూబ్ లో రిలీజ్ అయిన దగ్గరినుండి ఈ సాంగ్ కు సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు శ్రోతల నుండి కూడా విశేషమైన స్పందన లభిస్తోంది. 

 

ఇక ఈ సాంగ్ యూట్యూబ్ లో ఒక అద్భుతమైన రికార్డ్ ని సొంతం చేసుకుంది. రిలీజ్ అయిన 24 గంటల్లో అత్యధికులు వీక్షించిన లిరికల్ సాంగ్ గా రికార్డు సొంతం చేసుకోవడంతో పాటు, ఈ సినిమా టీజర్ కూడా 24 గంటల్లో అత్యధికులు వీక్షించిన ఫస్ట్ లుక్ టీజర్ గా మరొక రికార్డు ని దక్కించుకుంది. ఈ విధంగా రిలీజ్ కు ముందే సరిలేరు నీకెవ్వరు సినిమా రెండు అద్భుతమైన రికార్డులను దక్కించుకోవడం జరిగింది. ఇక జనవరి 11న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: