ప్రస్తుతం సుడిగాలి సుధీర్ హీరోగా మారి సాఫ్ట్ వేర్ సుధీర్ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. స్వతహాగా మంచి మెజీషియన్ అయిన సుధీర్, ఆ తరువాత కొన్నాళ్ళకు జబర్దస్త్ షోలో ఛాన్స్ సంపాదించి, మెల్లగా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ చివరికి ఆ షోలో ఒక టీమ్ ని ఏర్పాటు చేసుకునే స్థాయికి ఎదిగాడు. ఇక ప్రస్తుతం అతడికి యువతలో మంచి క్రేజ్ మరియు ఫాలోయింగ్ కూడా ఉంది అనే చెప్పాలి. ఇక కొన్నాళ్ల నుండి సుధీర్ కు మరియు ఆ షోలో యాంకర్ గా వ్యవహరిస్తున్న రష్మీ గౌతమ్ కు మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందని, 

 

మరికొద్దిరోజుల్లో వారు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి. అయితే అటువంటిది ఏమి లేదని, తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అని వారు ఎన్నిసార్లు మీడియా ముఖంగా చెప్పినా అవి ఆగలేదు. ఇకపోతే లేటెస్ట్ గా సుధీర్, ఈటివి లో ప్రసారం అయ్యే ఆలీతో సరదాగా అనే షోకు గెస్ట్ గా విచ్చేయడం జరిగింది. ఇక ఆ షో తాలూకు ప్రోమో ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయింది. అయితే అందులో ఆలీ, సుధీర్ కు ఒక ప్రశ్నను సంధించారు. నీ ఎదురుగా దీపికా పదుకొనే, అలానే కరీనా కపూర్ ఇద్దరూ ఉంటే, ముందుగా వారిలో నువ్వు ఎవరిని కౌగిలించుకుంటావు అని అడుగగా, వెంటనే సుధీర్ కాస్త చమత్కారంగా సమాధానం ఇచ్చాడు. 

 

అదేమిటంటే, ఇంతకీ రష్మీ ఎక్కడ అని అడుగుతానని అన్నాడు. కాగా ఈ సమాధానం షోలో వారితో నవ్వులు పూయించినప్పటికీ, దీనిపై రష్మీ గౌతమ్ కొంత ఆగ్రహంతో షో అనంతరం సుధీర్ పై సీరియస్ అయినట్లు టాలీవుడ్ వర్గాల టాక్. నా అనుమతి లేకుండా, ఆ విధంగా తన పేరును ఇష్టం వచ్చినట్లు పలు సందర్భాల్లో వాడితే ఇకపై ఊరుకునేది లేదని ఆమె సుధీర్ కు గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు చెప్తున్నారు. కాగా ఈ వార్త ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: