తాజాగా సూపర్స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం దర్బార్. ఈ చిత్రాన్ని ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే తొలి పాటను విడుదల చేయగా... ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్లో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాను ఇక సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానున్న విషయం మనకి తెలిసిందే. ఈ క్రమంలో 168 సినిమాకు సూపర్స్టార్ రజనీకాంత్ తదుపరి చిత్రం తలైవార్ సంబంధించిన ఆసక్తికర వార్తలు కోలీవుడ్లో ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి.
ఇక అస్సలు విషయానికి వస్తే సన్ పిక్చర్స్ ఇటీవల రజనీ తదుపరి సినిమాను తామే నిర్మిస్తున్నామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎంతిరన్, పేట వంటి బ్లాక్బస్టర్ హిట్ల తర్వాత ఈ కాంబినేషనన్లో రూపొందనున్న చిత్రం తలైవార్ 168కు దర్శకత్వం శివ వహించనున్నాడు. అయితే ఈ చిత్రంలో సీనియర్ నటి ప్రత్యేక పాత్రలో మీనా కనిపించనున్నట్లు ప్రస్తుత సమాచారం.
అంతేకాదు గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమాలో రజిని కాంత్ భార్యగా ఖుష్బూ ,రజనీ కూతురుగా కీర్తి సురేష్, నటించనున్నారంటూ వార్తలు ప్రచారమవుతున్నాయి. అయితే మూవీ యూనిట్ మాత్రం ఇంతవరకు ఇందుకు సంబంధించి ఎటువంటి ప్రకటన చేయలేదు. ప్రీ ప్రొడక్షన్ రెండు నెలలుగా పనుల్లో నిమగ్నమైన చిత్రబృందం.. రజనీతో కలిసి కమెడియన్ సూరి మాత్రం నటించే అవకాశం దక్కించుకున్నట్లు పేర్కొంది.
ఈ విషయం గురించి సూరి మాట్లాడుతూ... రజనీతో స్క్రీన్ షేర్ చేసుకోవాలన్న తన కల నిజమైందని తనకు చాల సంతోషంగ ఉందని ఆయన వ్యక్తం చేశాడు. ఇంతవరకు సూపర్స్టార్తో సెల్ఫీ తీసుకునే అవకాశం కూడా రాలేదని.. ఇప్పుడు ఆయన పక్కన కనిపించే అదృష్టం వరించిందంటూ ఓ వీడియోను విడుదల చేశాడు. ఇక ముత్తు సినిమా రజనీ- మీనా కాంబినేషన్లో తెరకెక్కినది అది హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. అదే విధంగా కథానాయకుడు సినిమాలోనూ వీరిద్దరూ తెరను పంచుకున్నారు.