తెలుగు టెలివిజన్ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న ‘జబర్ధస్త్’ కామెడీ షో లో  మద్య ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ముఖ్యంగా మెగాబ్రదర్ నాగబాబు ‘జబర్ధస్త్’ నుంచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో ఆమన మనోగతం వీడియోల రూపంలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  2013 నుంచి 2019 వరకు జబర్దస్త్‌తో నా ప్రయాణం సాగింది. ఈ ప్రయాణం మరిచిపోలేనిది. నాకు నేనుగా జబర్దస్త్‌ నుంచి బయటకు వస్తానని అనుకోలేదని అన్నారు. నా స్థాయికి తగ్గట్లు కాకపోయినా మంచి పారితోషికమే ఇచ్చారు. దీని గురించే నేను బయటకు వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ అందులో వాస్తవం లేదంటూ ‘జబర్ధస్త్’ పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు.  

 

జబర్దస్త్ షోలో ఏం జరిగింది? ఎందుకు బయటకు వచ్చేశారు? తరువాత ఏం చేయబోతున్నారో తెలియజేస్తూ జబర్దస్త్ యాజమాన్యంపై సంచలన కామెంట్స్ చేశారు. ఇప్పటి వరకు నాలుగు వీడియోలు రిలీజ్ చేసిన నాగబాబు ప్రతి వీడియోలోనూ పలు సంచలన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. తాజాగా నాగబాబు తన చివరి వీడియో రిలీజ్ చేసి జబర్ధస్త్ పై ఎమోషనల్ గా చాలా సీరియస్ అయ్యారు. జబర్దస్త్ టీంలో కష్టాల్లోనూ, నష్టాల్లోనూ ఒకరికి ఒకరం తోడుగా ఉండేవాళ్లం కాని.. మల్లెమాల టీంతో కమ్యునికేషన్ ఉండేది కాదు. అయితే ఈ షోలో నేను జడ్జీగా వ్యవహరిస్తున్నాను... ఆ బాధ్యతతో జబర్దస్త్ టీం వాళ్లతో ఎక్కువ నేను మాట్లాడుతూ... వారి కష్టాల గురించి తెలుసుకునేవాడిని.  జబర్ధస్త్ లో డైరెక్టర్లు  నితిన్, భరత్‌ విషయంలో మల్లమాల వాళ్లు తీసుకున్న నిర్ణయం చాలా బాధ అనిపించింది. 

 

అయితే జబర్దస్త్ నుంచి  నాతో పాటు కొంతమంది కమెడియన్స్ బయటకు వచ్చారు. అయితే వాళ్లను అగ్రిమెంట్లు పేరు చెప్పి.. భయపెట్టి రాజకీయాలు చేశారు అవన్నీ నాకు తెలుసు.  నేను ఎట్టి పరిస్థితుల్లో జబర్ధస్త్ లోకి తిరిగి వెళ్లే ప్రసక్తే లేదని అన్నారు.  అంతే కాదు  నేను కొంతమంది వైపు నిలబడ్డాలని అనుకున్నా... ఒక్కసారే  ఇప్పుడు వాళ్లను వదిలి వెనక్కి వెళ్లలేను. నేను జబర్దస్త్ నుండి బయటకు వచ్చిన తరువాత జీ తెలుగులో ఓ షో చేస్తున్నా..  నన్ను నమ్మి వచ్చిన వారికి మంచి భవిష్యత్ ఉండేలా చూస్తానని హామీ ఇస్తున్నా అన్నారు నాగబాబు. 

మరింత సమాచారం తెలుసుకోండి: