యంగ్ రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ కెరీర్ లో 20వ సినిమా జాన్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. గోపికృష్ణ మూవీస్- యువీ క్రియేషన్స్ సంయుక్తం గా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో యూరప్ ఆర్కిటెక్చర్ ని ప్రతిబింబిస్తూ నగరాన్ని సెట్ లో నిర్మించి అందులోనే కీలక షెడ్యూల్ ని తెరకెక్కిస్తున్నారు. పేద అమ్మాయిని ప్రేమించే రిచ్ పర్సన్ బ్యాగ్డ్రాప్ లవ్ స్టోరీ తో ఈ సినిమా తెరకెక్కుతోందని తాజా సమాచారం.

 

తాజాగా ఈ సినిమా కాస్టింగ్ లో చందమామ కాజల్ పేరు వినిపిస్తుండడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో ఓ అతిధి పాత్రలో మెరవబోతోందని తాజా షెడ్యూల్ లో తను కూడా జాయిన్ కానుందని లేటెస్ట్ న్యూస్. అయితే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం చిత్ర బృందం నుంచి ఇంకా రాలేదు.

 

ప్రభాస్ - కాజల్ కాంబినేషన్ అంటే సూపర్ హిట్టయిన డార్లింగ్- మిస్టర్ పెర్ఫెక్ట్ సినిమాలు గుర్తుకొస్తాయి. ఇక ఈ రెండు సినిమాల తర్వాత మళ్లీ ప్రభాస్ సరసన నటించే అవకాశం కాజల్ కి రాలేదు. ఇన్నాళ్టి కి డార్లింగ్ తో మరో ఛాన్స్ .. అది కూడా అతిధి పాత్ర కావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే డార్లింగ్ టైమ్ కి ఇప్పటికి ప్రభాస్ లో చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు అతడు బాహుబలి స్టార్. పాన్ ఇండియా హీరో. ఈ ఇమేజ్ వల్ల జాన్ కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే రిలీజవుతుందనడంలో సందేహం లేదు. అందుకే ఇలాంటి సినిమాలో అతిధి పాత్ర అయినా కాజల్ సై అని ఆతృతగా చూస్తుందట. ఇక ఇలాంటి అరుదైన అవకాశం వదులుకోలేకనే ప్రభాస్ ని రెక్వస్ట్ చేసిందంటూ ప్రభాస్ ఫ్యాన్స్ కూడా చెప్పుకుంటున్నారు. ఇక బాలీవుడ్ లో కాజల్ కెరీర్ డైలమాలో ఉన్న సంగతి తెలిసిందే. జాన్ లో నటిస్తే అది కాజల్ కి అక్కడ కూడా ప్లస్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: